Samyukta: ఫ్యాన్స్‌కి అదిరిపోయే గిఫ్ట్స్

Hyderabad: సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej), సంయుక్త మీనన్ (Samyuktha Menon) కలిసి నటించిన సినిమా విరూపాక్ష(Virupaksha). ఈ సినిమా ఇటీవలే విడుదలై పాజిటివ్ టాక్ దక్కించుకుంది. ఇప్పటికే ఈ సినిమా దాదాపు రూ.65 కోట్లు కలెక్ట్ చేసింది. కాగా, ఈ సినిమాలో సంయుక్త నటనకు మంచి మార్కులు పడ్డాయి. విరూపాక్ష విజయంతో సంయుక్తకు టాలీవుడ్(Tollywood) లో వరుసగా నాలుగు హిట్స్ దక్కాయి.

సంయుక్త నటనకు, అందానికే కాకుండా ఆమె మంచి మనసుకు ఫిదా అవుతున్నారు అభిమానులు. విరూపాక్ష సినిమాను ప్రేక్షకులతో కలిసి చూడటానికి వెళ్లగా థియేటర్లో డైరెక్టర్ కార్తీక్ ఫోన్ మిస్ అయ్యింది. దాంతో డైరెక్టర్‌‌కు ఐఫోన్‌ గిఫ్ట్ ఇచ్చింది సంయుక్త. ఈ విషయంలో సంయుక్తను పలువురు అభినందించారు. తాజాగా సంయుక్త చేసిన మరో మంచిపనికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

విరూపాక్ష టీంతో కలిసి ఓ టీవీ షోలో పాల్గొంది సంయుక్త మీనన్. దీంట్లో పలు గేమ్స్ పెట్టి గెలుపొందిన వారికి స్కూటీ గిఫ్ట్‌ ఇస్తామని చెప్పారు నిర్వాహకులు. ఈ స్కూటీని గెలిస్తే అక్కడ షోలో ఉన్న స్టూడెంట్స్ లో ఒకరికి ఇస్తాను అన్నాడు తేజ్. అయితే ఆ గేమ్‌లో సంయుక్త విజయం సాధించింది. సంయుక్త కూడా తేజ్ చెప్పినట్టు స్కూటీ ఇస్తానని చెప్పింది. తాను సింగిల్ పేరెంట్ చైల్డ్ అని, ఫాదర్ లేరని, అమ్మే తనను కష్టపడి పెంచిందని చెబుతూ అంటూ ఎమోషనల్ అయ్యింది సంయుక్త.

అందుకే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ లో సింగిల్ పేరెంట్ ఉన్న అమ్మాయిలను రమ్మనడంతో ఇద్దరు స్టూడెంట్స్ వచ్చారు. వాళ్లు కాలేజీలో చదువుతున్నామని, రోజూ బస్సులో వెళ్తామని చెప్పారు. అయితే అక్కడ ఒక స్కూటీనే ఉండటంతో సంయుక్త ఆ స్కూటీ ఒక అమ్మాయికి ఇచ్చి ఇంకో అమ్మాయికి తానే స్వయంగా స్కూటీ కొనిస్తానని చెప్పింది. దీంతో ఆ ఇద్దరు అమ్మాయిలు ఎమోషనల్ అయ్యి సంయుక్తను హత్తుకున్నారు.