Gopichand: ఆ విష‌యంలో ఇప్ప‌టికీ బాధ‌ప‌డుతున్నా

Hyderabad: టాలీవుడ్​ హీరో గోపీచంద్(Gopichand)​, డింపుల్​ హయాతీ(Dimple Hayati) జంటగా నటించిన సినిమా రామబాణం(Ramabanam). శ్రీవాస్​(Sriwass) దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన టీజర్​, ఫస్ట్​లుక్​, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమా మే 5న విడుదల కానుండటంతో జోరుగా ప్రమోషన్స్​లో పాల్గొంటోంది చిత్రబృందం.  ఈ సినిమా ప్రమోషన్స్​ వెరైటీగా ప్లాన్​ చేసిన చిత్రబృందం డైరెక్టర్​ తేజ(Teja)తో గోపీచంద్​ ఇంటర్వ్యూ ప్లాన్​ చేసింది. తేజ రూపొందించిన జయం(Jayam), నిజం(Nijam) సినిమాల్లో గోపీచంద్​ విలన్​గా కనిపించిన సంగతి తెలిసిందే.

ఈ ఇంటర్వ్యూలో గోపీచంద్​ మాట్లాడుతూ..‘మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. సినిమా షూట్‌ చేస్తున్నప్పుడు కొన్ని సీన్ల నిడివి ఎక్కువగా ఉంది. అప్పుడు శ్రీవాస్‌ను పిలిచి.. ఒకవేళ షూట్‌ చేసినా ఎడిటింగ్‌లో తీసేసే అవకాశం ఉంది అని చెప్పాను. దానికి ఆయన.. అలా కాదు చిత్రీకరిద్దాం. ఒకవేళ అప్పటికప్పుడు కావాలంటే మళ్లీ ఫుటేజీ రాదు కదా..అన్నారు. నేను ఎంత చెప్పినా వినలేదు. తీరా చూస్తే ఎడిటింగ్‌ టేబుల్‌పైకి వెళ్లాక ఆ సన్నివేశాలను ఎడిటర్‌ కట్‌ చేసేశారు. ఇదే మా మధ్య జరిగింది. దీన్నే అందరూ గొడవలు అయ్యాయని రాసేశారు’ అంటూ వివరణ ఇచ్చారు గోపీచంద్​. అంతేకాదు ఇదే ఇంటర్వ్యూలో తనకు లైఫ్​ ఇచ్చిన డైరెక్టర్​ తేజ ఫోన్ చేస్తే​ ఎత్తకపోవడానికి కూడా కారణం చెప్పి ఆ విషయానికి ఇప్పటికీ తాను బాధపడుతున్నట్లు తెలిపారు గోపీచంద్​.