“రజనీకాంత్‌ సిగ్గులేకుండా చంద్ర‌బాబును పొగుడుతున్నారు”

vijayawada: కృష్ణా జిల్లాలో నిన్న జరిగిన ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల (ntr 100 years celebrations) సభకు తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Super Star Rajanikanth) ముఖ్యఅతిథిగా హాజరై.. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును (tdp chief chandrababu) ప్రశంసించారు. ఎన్టీఆర్‌ యుగపురుషుడైతే.. చంద్రబాబు విజనరీ అని ఆయన అన్నారు. చంద్రబాబు రూపొందించిన విజన్‌-2047 ప్రణాళిక అమలైతే అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ ఎక్కడికో వెళ్లిపోతుందని ఆయన చెప్పారు. ఇక తలైవా వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఫైర్‌ అయ్యారు. మాజీ మంత్రి కొడాలి నాని (ex minister Kodali Nani), మంత్రి రోజా (Minister Roja) చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.

మూడు రోజులు షూటింగ్ చేస్తే నాలుగు రోజులు ఆస్పత్రిలో పడుకునే రజనీకాంత్, తెలుగు ప్రజలకు ఏం చెబుతారు..?. ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను రజనీ చదువుతూ మరింత దిగజారుతున్నారు’ అని కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జీరో అయిన రజనీకాంత్.. సిగ్గు శరం లేకుండా చంద్రబాబును పొగుడుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను బ్లాక్‌మెయిల్ చేసేందుకే.. రజనీకాంత్‌ను చంద్రబాబు రంగంలోకి దించారు. చంద్రబాబు రాజకీయాలను ఇకనైనా పవన్ గ్రహించాలి. ఎన్టీఆర్‌పై చెప్పులు విసురుతుండగా వైస్రాయ్ హోటల్‌లో చంద్రబాబుకు మద్దతు తెలిపిన రజనీకాంత్ ఇప్పుడు ఎన్టీఆర్‌ను పొగడటం సిగ్గుచేటు అని నాని అన్నారు. ఎన్టీఆర్‌ను వెన్ను పోటుపోడిచిన బాబును రజనీ పొగడటం విడ్డూరంగా ఉందని మంత్రి రోజా అన్నారు. సభకు పిలిచారు కాబట్టి బాబును పొడిగినట్లుగా ఉందని.. ఎన్టీఆర్‌ని చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన విషయం రజనీకాంత్‌కు తెలియదా..? అంటూ రోజా ప్రశ్నించారు.