బ్యూటీ పార్ల‌ర్‌కి వెళ్ల‌నివ్వ‌ని భ‌ర్త‌.. భార్య ఆత్మ‌హ‌త్య‌

Bhopal: భ‌ర్త బ్యూటీ పార్ల‌ర్‌(beauty parlour)కు వెళ్ల‌నివ్వ‌కుండా అడ్డుకున్నాడ‌ని మ‌న‌స్తాపంలో ఆత్మ‌హ‌త్య చేసుకుని ఓ మ‌హిళ‌. ఈ ఘ‌ట‌న మ‌ధ్య ప్ర‌దేశ్‌(madhyapradesh)లో చోటుచేసుకుంది. ఇండోర్ జిల్లాకు చెందిన రీనా యాద‌వ్ గురువారం బ్యూటీ పార్ల‌ర్‌కు వెళ్లి వస్తాన‌ని భ‌ర్త‌కు చెప్పింది. ఇందుకు భ‌ర్త ఒప్పుకోలేదు. అప్ప‌టికే మ‌న‌స్తాపం చెందిన రీనా.. భ‌ర్త బ‌య‌టికి వెళ్ల‌గానే త‌లుపులు వేసుకుని ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకుంది. భ‌ర్త ఇంటికి వ‌చ్చి చూడ‌గానే రీనా ఫ్యాన్‌కు వేలాడుతూ క‌నిపించ‌డంతో షాకయ్యాడు. రీనా మృతదేహాన్ని ప‌ట్టుకుని విల‌పించాడు. ఆ త‌ర్వాత పోలీసులు రావ‌డంతో కేసు న‌మోదైంది. అయితే బ్యూటీ పార్ల‌ర్‌కు వెళ్ల‌నివ్వ‌లేద‌న్న కార‌ణంతోనే ఆత్మ‌హ‌త్య చేసుకుందా లేదా ఇంకేమైనా ఉందా అన్న కోణంలో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.