మెట్రోలో యువ‌కుడి పాడు పని.. ఇంకెన్ని చూడాలో..!

Delhi: మెట్రోలో(delhi metro) ఓ యువ‌కుడు చేసిన పాడుప‌నికి జాతీయ మ‌హిళా క‌మిష‌న్(woman commission) ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. దిల్లీకి(delhi) చెందిన ఓ యువ‌కుడు మెట్రో ఎక్కి ఫోన్‌లో ఏదో చూసుకుంటూ మాస్ట‌ర్బేష‌న్ చేసుకోవ‌డం మొద‌లుపెట్టాడు. దాంతో చుట్టూ ఉన్న ప్ర‌యాణికులు అసౌక‌ర్యానికి గుర‌య్యారు. ఏమీ అన‌లేక దూరం జ‌రిగిపోయారు. ఓ ప్ర‌యాణికుడు మాత్రం ఆ పాడుప‌నిని వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట చేయ‌డంతో వైర‌ల్‌గా మారింది. సిగ్గ‌లేకుండా పబ్లిక్ ప్ర‌దేశంలో ఇలాంటి పాడుప‌ని చేస్తున్న ఆ వ్య‌క్తిపై వెంట‌నే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మ‌హిళా క‌మిష‌న్ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎంత‌సేపూ దిల్లీ మెట్రో అధికారుల‌ను చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెప్పే బ‌దులు అక్క‌డే ఉన్న ప్ర‌యాణికులు ఎందుకు రియాక్ట్ అవ్వ‌లేద‌న్న ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి.

ప‌క్క‌నే ఉన్న ఇత‌ర ప్ర‌యాణికులు అసౌక‌ర్యంతో ప‌క్క‌కి వెళ్లిపోయే బదులు లాగి నాలుగు పీకి ఉంటే ఇలాంటి ఘ‌ట‌న‌లు మున్ముందు జ‌ర‌గ‌కుండా ఉంటాయ‌ని అన్నారు. ప్ర‌జ‌లు ఏమీ చేయ‌క‌పోగా అధికారుల‌ను , ప్ర‌భుత్వాన్ని నిందిస్తూ కూర్చుంటే స‌మాజంలో మార్పు అనేది ఎలా క‌నిపిస్తుంద‌ని మండిప‌డుతున్నారు. ఈ మ‌ధ్య‌కాలంలో దిల్లీ మెట్రోలో ఇలాంటి ఘ‌ట‌న‌లు చాలా జ‌రుగుతున్నాయి. కొన్ని నెల‌ల క్రితం ఓ యువ‌తి కేవ‌లం బ్రా, స్క‌ర్ట్ వేసుకుని దిల్లీ మెట్రోలో ప్ర‌యాణించింది. తోటి ఆడ‌వారికి కూడా అసౌక‌ర్యంగా అనిపించే దుస్తులు వేసుకోవ‌డం ఓ ప్యాసెంజ‌ర్ వీడియో తీసి దిల్లీ మెట్రో అధికారుల‌కు ఫిర్యాదు చేసారు. ఇంకోసారి ఇలాంటి ప‌నులు చేస్తే బాగోద‌ని అధికారులు హెచ్చ‌రించారు. అంతేకాదు.. రెండు రోజుల క్రితం ఓ యువ‌కుడు మెట్రోలోనే ప‌ళ్లు తోముకుంటూ క‌నిపించాడు. ఇంకా ఇలాంటి ద‌రిద్రాలు ఎన్ని చూడాల్సి వ‌స్తుందోన‌ని ప్ర‌యాణికులు త‌ల‌బాదుకుంటున్నారు.