SSMB28: అదిరిపోయే అప్​డేట్​!

Hyderabad: సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు డైరెక్టర్​ త్రివిక్రమ్(Trivikram) కాంబినేషన్లో రూపొందుతున్న మోస్ట్​ అవెయిటెడ్​ మూవీ SSMB28. వీరిద్దరి కాంబినేషన్​లో వచ్చిన అతడు(Athadu), ఖలేజా(Khaleja) ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమా మొదలైనప్పటినుంచీ రకరకాల రూమర్స్​ హల్​చల్ చేస్తూనే ఉన్నాయి. ఇక, తాజాగా మహేష్​ బాబు షూటింగ్​కి బ్రేక్​ ఇచ్చాడనీ, మూన్నెళ్ల పాటు ఈ సినిమా షూటింగ్​ వాయిదా పడిందంటూ పలు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్ర నిర్మాత నాగవంశీ(Nagavamsi) వీటి పై స్పందిస్తూ రూమర్లు రాసే వారికీ గట్టి కౌంటర్ ఇచ్చాడు. అలాగే మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు.

SSMB28పై వస్తున్న రూమర్స్​కి కౌంటర్​ ఇస్తూ.. ‘పక్షులు ఆహారం కోసం వెతుకుతున్నప్పుడు బిగ్గరగా అరుస్తాయి. అదే విధంగా, ఎవరికైనా ఫేమ్ అవసరమైనప్పుడు పుకార్లు వ్యాపిస్తాయి. వాటిని పట్టించుకోక పోవడం లేదా వారిని చూసి నవ్వడం చెయ్యండి. ఈ గాసిప్ రాయుళ్లు వాళ్ళ పుకార్లుతో సినిమాలు చేస్తే ఇండస్ట్రీకి లాభం చేకూరుతుంది. SSMB28 ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్‌గా ఉండాలని మేము కోరుకుంటున్నాము. అందుకోసం జాగ్రత్తగా పని చేయనివ్వడం మంచిది. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ మీకు ఎంతగానో నచ్చింది. మే 31న మీ కోసం ఒక సర్‎ప్రైజ్ రెడీ చేస్తున్నాము. దాని కోసం ఎదురు చూస్తూ ఉండండి’ అంటూ ట్వీట్ చేశారు నిర్మాత నాగవంశీ. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్​గా నటిస్తుండగా, శ్రీలీల(Sreeleela) సెకండ్​ హీరోయిన్​గా కనిపించనుంది.  ఇంకా టైటిల్​ ఖరారు కాని ఈ చిత్రం వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.