Pooja Hegde అందం వెనుక రహస్యం ఏంటో తెలుసా?

Hyderabad: సినిమాలు, మోడలింగ్​ రంగంలో ఉండే మహిళలకు అందమే ప్రాధాన్యం. అందుకే లేచిన్పటి నుంచి అందాన్ని కాపాడుకోవడంపైనే వాళ్ల దృష్టి, ఆసక్తి ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో  స్టార్ హీరోయిన్‌ పూజా హెగ్డే(Pooja Hegde) తన అందం వెనుక రహస్యాన్ని బయటపెట్టింది.. తను సహజ మెరుపు పొందేందుకు  పొద్దున్నే పాల మీగడలో పసుపు కలిపి, ఆ పేస్ట్ ను ముఖానికి పట్టిస్తుందట. ఇలా చేయడం వల్ల రోజంతా ముఖం మెరుస్తూ ఉంటుందని, ఇది పూర్తిగా నేచురల్ ఫేస్ ప్యాక్ అని చెబుతోంది.

రోజూ తినే భోజనంలో కార్బోహైడ్రేట్లు, నెయ్యి ఉండేలా చూసుకుంటుందట. చాలా మంది హీరోయిన్లు బరువు పెరుగుతామనే భయంతో కార్బోహైడ్రేట్స్ ను దూరంగా ఉంచుతారు. కానీ, అలా చేయడం వల్ల ముఖవర్చస్సు దెబ్బతింటుందని చెబుతోంది పూజా హెగ్డే. సరైన మోతాదులో కార్బోహైడ్రేట్స్ తినడంతో పాటు, రోజూవారీ ఆహారంలో నెయ్యిని ఉపయోగించడం వల్ల ముఖం మెరుస్తుందని చెబుతోంది.

ఇక, బయటకు వెళ్లేముందు చేతులకు, భుజానికి, మెడకు సన్ స్క్రీన్ లోషన్ తప్పనిసరిగా రాసుకోవాలంటోంది పూజా. ఇలా చేయడం వల్ల చర్మం కమిలిపోకుండా ఉంటుందని సలహా ఇస్తోంది పూజా. ఇక, షూటింగ్స్ లేని సమయాల్లో పూర్తిగా మేకప్ కు దూరంగా ఉంటుందట పూజా. దీనివల్ల ముఖంలోని సహజమైన కాంతి మరింత మెరుడు పడుతుందని, సహజమైన అందాన్ని కాపాడుకోవడానికి మేకప్ కు దూరంగా ఉండడమే సరైన మార్గమని అంటోంది పూజా హెగ్డే.

కాగా, పూజా హెగ్డే ప్రస్తుతం మహేష్‌బాబు(Mahesh Babu)–త్రివిక్రమ్(Trivikram) సినిమాలో నటిస్తోంది. SSMB28 వర్కింగ్ టైటిల్‌ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో పూజా హెగ్డేతోపాటు శ్రీలీల కూడా నటిస్తోంది.