Simhadri: అతిపెద్ద స్క్రీన్​పై తారక్​ సినిమా!

Hyderabad: యంగ్ టైగర్ ఎన్టీఆర్‌‌ (Jr NTR) కెరీర్‌‌లో బిగ్గెస్ట్ హిట్స్‌ లో ఒకటైన సింహాద్రి(Simhadri) సినిమాను రీ రీలిజ్ చేయనున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20వ తేదీన ఈ బ్లాక్ బస్టర్ సినిమాను విడుదల చేయడానికి అభిమానులు సిద్ధమయ్యారు. ఛారిటీ కోసం ఏర్పాటు చేసిన ఈ సినిమా రీ రిలీజ్‌ను ఎన్టీఆర్‌‌ ఫ్యాన్స్‌ అందరూ సక్సెస్ చేయాలని నిర్ణయించుకున్నారు.

కొత్త సినిమా విడుదల సమయంలో చేసే ఈవెంట్స్‌ వలె ఈ బ్లాక్ బస్టర్ సినిమా రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సింహాద్రి సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్‌తోపాటు ట్రైలర్‌‌ను విడుదల చేశారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా సింహాద్రి సినిమాను 4K వెర్షన్‌లో రిలీజ్ చేస్తున్నారు. అయితే, సింహాద్రి (Simhadri) సినిమా రీరిలీజ్ కోసం ఏకంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఐమ్యాక్స్‌ స్క్రీన్‌ను బుక్ చేసేశారు తారక్ అభిమానులు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో ప్రపంచంలోనే అతిపెద్ద IMAX స్క్రీన్ ఉంది. ఈ స్క్రీన్ లో సింహాద్రి సినిమా స్పెషల్ షో వేయనున్నట్టు ఎన్టీఆర్ అభిమానులు ప్రకటించారు.

మే 20న ఉదయం 9:00 గంటలకి ఈ స్పెషల్ షో స్టార్ట్ అవుతుందని, టికెట్ల బుకింగ్స్‌ కూడా ఓపెన్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఆస్ట్రేలియాతోపాటు డల్లాస్ లో తారక్‌కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఈ ఏరియాల్లో సింహాద్రి సినిమా రీరిలీజ్ కలెక్షన్స్ రికార్డు స్థాయిలో ఉంటాయని ఆశిస్తున్నారు. ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ (RRR) సినిమాతో తారక్‌కు వచ్చిన క్రేజ్‌ కూడా సింహాద్రి రీ రిలీజ్‌పై ప్రభావం చూపుతుందని తెలుస్తోంది. కాగా, రెండు దశాబ్దాల క్రితం విడుదలై సూపర్ హిట్ సాధించిన సింహాద్రి సినిమాను దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) తెరకెక్కించారు. అంకిత, భూమిక హీరోయిన్లుగా నటించారు.