karnataka elections: సేమ్ టు సేమ్ కామెంట్!

Bengaluru: కన్న‌డ‌నాట రాజ‌కీయాలు(karnataka elections) వేడెక్కుతున్నాయి. చూడ‌బోతే కాంగ్రెస్(congress) పార్టీకి కామెంట్లు(siddaramaiah) చేసేసి చిక్కుల్లో ప‌డ‌టం అల‌వాటైపోయిన‌ట్లుంది. నాడు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(rahul gandhi) మోదీ ఇంటిపేరున్న‌వారంతా దొంగ‌లే అని కామెంట్ చేసి ఇరుక్కున్నారు. నేడు క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి సిద్ధా రామ‌య్య(siddaramaiah) అలాంటి కామెంటే చేసి బుక్ అయ్యారు. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో బీజేపీ లింగాయ‌త్‌ల‌కు ప్ర‌ధాన్య‌త ఇవ్వాల‌ని చూస్తోంది. క‌ర్ణాట‌క త‌ర్వాతి ముఖ్య‌మంత్రి లింగాయ‌త్ అయ్యి ఉండాల‌ని బీజేపీ వ్యాఖ్యానించింది. దీనికి సిద్ధా రామ‌య్య స్పందిస్తూ.. ఇప్పుడు ఉన్న సీఎం బ‌స‌వ‌రాజ్ బొమ్మై లింగాయ‌తే క‌దా.. ఆయ‌న వ‌ల్లే క‌దా రాష్ట్రంలో అవినీతి మొద‌లైంది అన్నారు. దాంతో లింగాయత్ వ‌ర్గానికి చెందిన‌వారంతా అవినీతిప‌రులే అని సిద్ధా రామ‌య్య అన్నార‌ని, ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బీజేపీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. తాను అంద‌రినీ ఉద్దేశించి అన‌లేద‌న‌, కేవ‌లం బొమ్మై గురించే అన్నాన‌ని సిద్ధా రామ‌య్య తెలిపారు.