Nagarjuna: మల్టీస్టారర్లలకు సై అంటున్న సీనియర్​ హీరో!

Hyderabad: కొంత కాలంగా వరుస ఫ్లాప్స్ తో అభిమానులను నిరాశకి గురి చేస్తున్న సీనియర్‌‌ హీరో అక్కినేని నాగార్జున(Nagarjuna Akkineni). నిజానికి ప్రయోగాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన నాగ్​ను ఒకప్పుడు స్టార్ హీరోగా నిలబెట్టిన ఆ ప్రయోగాలే ఇప్పుడు మాత్రం తేడా కొడుతున్నాయి. దాదాపు ముప్పై ఏళ్ల నుంచి టాలీవుడ్​ టాప్​ హీరోల్లో ఒకరిగా వెలుగు వెలిగిన నాగార్జునకి ఈ మధ్య వరుస డిజాస్టర్లు వచ్చి చేరాయి. దాంతో నాగ్​ మల్టీస్టారర్లకి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ రకంగానైనా హిట్​తో కమ్​బ్యాక్​ అవ్వాలని చూస్తున్నారట.

నాగార్జున హీరోగా ఇటీవల విడుదలైన ‘ఘోస్ట్’(Ghost) చిత్రం కూడా 10 కోట్ల రూపాయల లోపే షేర్ వసూళ్లు రాబట్టింది. దాదాపు 30 సంవత్సరాల నాగార్జున సినీ కెరీర్‌‌లో ఈ తరహా కలెక్షన్లు, షేర్లు రావడం ఇదే మొదటిసారి. వరుసగా వస్తున్న సినిమా రిజల్ట్స్‌ ను దృష్టిలో పెట్టుకుని నాగార్జున కొన్నాళ్లు ప్రయోగాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని టాక్. నాగచైతన్య(Naga Chaitanya) కాంబినేషన్లో చేసిన బంగార్రాజు(Bangarraju)తో కాస్త ఫర్వాలేదనిపించినా మళ్లీ నాగార్జునకి హిట్​ పడలేదు.

ఈ క్రమంలోనే నాగార్జున సోలో హీరోగా కంటే మల్టీ స్టారర్ సినిమాలు చేసిన మరోసారి తన మార్కెట్‌ను పెంచుకోవాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రసన్న కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యబోతున్నారు. ఈ చిత్రంలో నాగార్జున తో అల్లరి నరేష్(Allari Naresh) కి కూడా సమానమైన పాత్రని డిజైన్ చేశాడట డైరెక్టర్ ప్రసన్న కుమార్. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లనుంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే తమిళ స్టార్ హీరో సూర్య(Suriya) తో కలిసి ఒక సినిమా చేయబోతున్నారట నాగార్జున. ఒక కొత్త డైరెక్టర్‌‌ ఈ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ఇలా వరుసగా ఆయన మల్టీస్టారర్‌‌ ప్రాజెక్టులకు ఓకే చెబుతున్నారట.