Virupaksha: ధ‌ర‌మ్ తేజ్‌ని ఆకాశానికెత్తేస్తున్న స్టార్స్

Hyderabad: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej)ప్రమాదం తర్వాత నటించిన సినిమా విరూపాక్ష(Virupaksha). మిస్టిక్ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 21న రిలీజ్ అయ్యింది. సంయుక్త మీనన్(Samyukta Menon)​ హీరోయిన్​గా నటించిన ఈ సినిమా మొదటి షో నుంచీ హిట్​ టాక్​తో సక్సెస్​ఫుల్​గా కొనసాగుతుంది. ఇక సాయి ధరమ్ కమ్ బ్యాక్ ఇస్తూ చేసిన మూవీ కావడంతో మెగా ఫ్యామిలీ కూడా ఆ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్​ చిరంజీవి(Chiranjeevi) సాయి ధరమ్ ని అభినందిస్తూ మూవీ సక్సెస్ ని సెలెబ్రేట్ చేసుకున్నారు. పలువురు సినీ ప్రముఖులు సాయ ధరమ్​ తేజ్​ని ప్రశంసిస్తున్నారు. టాలీవుడ్​ హీరో, రచయిత అడివి శేష్​(Adivi Sesh) విరూపాక్ష టీంకి శుభాకాంక్షలు తెలిపారు. పవన్​ కల్యాణ్(Pawan Kalyan)​ కూడా సాయి ధరమ్​ని అభినందిస్తూ బొకే పంపించారు.

తాజాగా ఈ మూవీ సక్సెస్ గురించి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ట్వీట్​ చేశారు. ‘కాంగ్రాట్యులేషన్స్ బ్రదర్. విరూపాక్ష గురించి మంచి టాక్ వినిపిస్తుంది’ అంటూ ట్వీట్ చేశారు. దీనికి సాయి ధరమ్ ‘థాంక్యూ సో మచ్ మై లవింగ్ బ్రదర్ చరణ్’ అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఈ సినిమా కలెక్షన్స్ పరంగా జోరు చూపిస్తుంది. మొదటి రోజే ఏకంగా రూ.12 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకొని సాయి ధరమ్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది. అలాగే US బాక్స్ ఆఫీస్ వద్ద కూడా 200K డాలర్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టినట్లు తెలుస్తుంది. కార్తీక్​ దండు(Karthik Dandu) దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రమాదం తర్వాత సాయి ధరమ్​కి మంచి కమ్​బ్యాక్​ సినిమాగా నిలవడంతో మెగా ఫ్యామిలీ ఆనందంలో మునిగిపోతోంది.