Fan wars: ప‌వ‌న్ ఫ్యాన్‌ని చంపేసిన‌ ప్ర‌భాస్ ఫ్యాన్‌..!

Hyderabad: ఫ్యాన్ వార్స్(fan wars) ఒక‌రి ప్రాణాన్ని బ‌లితీసుకుంది. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఏలూరు నుంచి కిశోర్‌, హ‌రికుమార్‌లు అత్తిలిలోని ఓ భ‌వ‌నానికి రంగులు వేయ‌డానికి మూడు రోజుల క్రిత‌మే అత్తిలి వ‌చ్చారు. రాత్రి వేళ‌ల్లో అదే భ‌వనంపై ప‌డుకుంటుండేవారు. నిన్న రాత్రి వీరి మ‌ధ్య ఫ్యాన్ వార్ జ‌రిగింది. హ‌రికుమార్ రెబెల్ స్టార్ ప్ర‌భాస్(prabhas) ఫ్యాన్. ఏలూరులో ప్ర‌భాస్(prabhas) అభిమానుల సంఘానికి కార్య‌ద‌ర్శిగా వ్య‌వ‌హ‌రిస్తుండేవాడు. మ‌రోప‌క్క కిశోర్ ప‌వ‌న్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు(pawan kalyan) వీరాభిమాని. అయితే నిన్న రాత్రి హ‌రి కుమార్ త‌న వాట్సాప్ స్టేట‌స్‌లో ప్ర‌భాస్ ఫొటోలు పెట్టుకున్నాడు. దానికి కిశోర్ వ‌ద్దు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫొటోలు పెట్టుకో అన్నాడు.

నేనెందుకు ప‌వ‌న్ ఫొటో పెట్టుకోవాల‌ని మా ప్ర‌భాస్ ఫొటో పెట్టుకుంటా అంటూ ఇద్ద‌రూ వాదించుకున్నారు. అది కాస్తా పెద్ద ర‌చ్చ‌కు దారితీసింది. దాంతో హ‌రికుమార్ కోపంతో కిశోర్‌ను సెంట్రింగ్ క‌ర్ర‌తో త‌ల‌పై కొట్టాడు. అంత‌టితో ఆగ‌కుండా అక్క‌డే ఉన్న సిమెంట్ రాయితో కొట్టడంతో కిశోర్ అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయాడు. ఈ గొడ‌వ జ‌రిగిన‌ప్పుడు వారిద్ద‌రూ తాగి ఉన్నారు. దాంతో స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే హ‌రికుమార్‌ను ఏలూరులో అరెస్ట్ చేసారు. కిశోర్ మృత‌దేహాన్ని వారి త‌ల్లిదండ్రుల‌కు అప్ప‌గించారు. గ‌తంలోనూ ఎన్టీఆర్ అభిమానికి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానికి గొడ‌వ జ‌రిగింది. వారు చిన్న‌వ‌య‌సులోనే నా హీరో గొప్ప అంటే నా హీరో గొప్ప అంటూ గొడ‌వ‌ప‌డడంతో.. తార‌క్ అభిమాని ప‌వన్ అభిమానిని పొడిచి చంపేసాడు. అప్ప‌ట్లో అది సంచ‌ల‌నంగా మారింది. మృతుడి ఇంటికి ప‌వ‌న్ వెళ్లి ప‌రామ‌ర్శించారు కూడా.