కూలర్‌లో నీరు పోస్తూ… షాక్‌తో జవాను మృతి

mulugu: తెలంగాణ రాష్ట్రం(telangana state)లో నిన్న మంచీర్యాల జిల్లా చెన్నూరు(chennuru)లో నివాసం ఉంటున్న దంపతులు(husband and wife) విద్యుత్‌ షాక్‌తో మృతి(died with current shock) చెందిన విషయం తెలిసిందే. మహిళ దుస్తులు ఆరేస్తుండగా.. ఒక్కసారిగా షాక్‌ కొట్టి ఆమె పడిపోయారు. ఇక ఆమెను రక్షించే క్రమంలో.. భర్తకు కూడా షాక్‌ కొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరూ చనిపోయారు. ఇక ఈ ఘటన మరువకముందే.. మరో సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. ములుగు జిల్లా(mulugu district) వాజేడు మండలం శ్రీరామ్ నగర్‌లో విషాదం నెలకొంది. విద్యుత్తు షాక్ తో ఐటీబీపీ జవాన్(itbp jawan) మనోజ్ కుమార్(manoj kumar)మృతి చెందాడు. ఇంట్లోని కూలర్(cooler) లో నీరు నింపుతుండగా షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న మనోజ్ ఇటీవలే సెలవులపై ఇంటికి వచ్చాడు. ఎండ ఎక్కువగా ఉండటంతో.. కూలర్‌లో నీరు నింపుతున్న క్రమంలో విద్యుత్తు షాక్‌కు గురికావడం బాధాకరం. కూలర్‌ ప్లగ్‌ కరెంట్‌ బోర్డులో పెట్టి నీరు పోస్తుండగా.. షాక్‌ కొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటి నుంచైనా ప్లగ్‌ బోర్డులో పెట్టకుండా.. నీరు నింపితే.. షాక్‌ కొట్టే ప్రమాదం ఉండదని పలువురు సూచిస్తున్నారు.