politics: ఏ గుడికైనా వస్తా… డబ్బు తీసుకున్నట్లు నిరూపించు

hyderabad: బీజేపీ నాయకుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌(etela rajender).. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి(tpcc chief revanth reddy) కేసీఆర్‌(kcr) దగ్గర డబ్బులు తీసుకుని పాదయాత్ర చేస్తున్నారని ఆరోపణలు చేశారు. అది పెయిడ్‌ యాత్ర అంటూ కామెంట్స్‌ చేశారు. ఇక దీనిపై రేవంత్‌ రెడ్డి ఫైర్‌ అయ్యారు. తాను డబ్బులు తీసుకున్నట్లు ఈటల రుజువు చేయాలని ఏ గుడికైనా వెళ్లి అగ్నిసాక్షిగా ప్రమాణం చేస్తానని రేవంత్‌ మండిపడ్డారు. తన పోరాటాన్ని ఈటల కించపరిచారని.. రేపు సాయంత్రం(శనివారం) 6 గంటలకు చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర సిద్దంగా ఉండు. అగ్నిపరీక్షకు నేను సిద్ధంగా ఉన్నానంటూ రేవంత్ విమర్శలు చేశారు. ఈటల తాత్కాలిక దిగజారుడు రాజకీయాలు చేయడం దుర్మార్గం అని పేర్కొన్నారు.

తాను బీఆర్‌ఎస్‌(brs) నుంచి డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేస్తానని.. ఈటల కూడా వచ్చి ప్రమాణం చేయాలని రేవంత్‌ పిలుపునిచ్చారు. ఈ విషయంలో ఈటల దిగజారి మాట్లాడుతున్నారు అంటూ రేవంత్‌ మండిపడ్డారు. భాగ్యలక్ష్మి టెంపుల్‌ వద్దంటే.. నువ్వు చెప్పిన గుడి వద్దకే వస్తా. నేను డబ్బులు తీసుకోలేదని దేవుడిపై ఒట్టేసి చెప్తా. నా సవాల్‌ స్వీకరించి గుడికి వచ్చి ఈటల ప్రమాణం చేయాలి అని రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. ఇంకో ఆరు నెలలు ఆగితే… రాష్ట్రమే గుంజుకుంటాం.. కేసీఆర్ దగ్గర రూ. 25 కోట్లు తీసుకుంటమా? విచక్షణ మరచిపోయి మాట్లాడితే ఎలా అంటూ.. రేవంత్ రెడ్డి తనదైన స్టైల్లో కౌంటర్‌ ఇచ్చారు. మరి దీనిపై ఈటల ఏవిధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.