hyderabad: బాలుడి దారుణ హత్య.. నరబలిగా అనుమానం!

sanathnagar: హైదరాబాద్‌లోని సనత్ నగర్‌(sanathnagar)లో దారుణం చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల బాలుడిని అమావాస్య రోజు కిడ్నాప్‌(kidnap) చేసి చంపడంతో నరబలి(human sacrifice) జరిగినట్లు పలువురు భావిస్తున్నారు. సనత్‌నగర్‌ పారిశ్రామికవాడలో నివాసం ఉంటున్న ఫిజాఖాన్‌ అనే హిజ్రా.. కోటిలో ఉండే దుస్తుల వ్యాపారి వసీంఖాన్ కుమారుడిని (8) హత్య(eight years boy murderd) చేసినట్లు పోలీసులు నిర్దారించారు. ఇది నరబలా లేదా ఇతర కారణాలతో హత్య చేశారో అన్నదానిపై దర్యాప్తు చేపట్టినట్లు వారు చెబుతున్నారు. అయితే ఫిజాఖాన్‌ స్థానికంగా చిట్టీల వ్యాపారం చేస్తోంది. ఆమె వద్ద వసీంఖాన్‌(vaseem khan) కూడా చిట్టీ కడుతున్నారు. ఆ విధంగా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో చిట్టీ వేసిన డబ్బులు ఫిజాఖాన్‌(fizakhan) ఇవ్వకపోవడంతో.. వసీంఖాన్‌ మధ్య గురువారం గొడవ జరిగింది. ఈక్రమంలో గురువారం సాయంత్రం వసీంఖాన్ కుమారుడిని నలుగురు వ్యక్తులు బస్తీలోని ఓ వీధిలో అపహరించి.. తీసుకెళ్లిపోయారు. బాలుడు కనిపించకపోవడంతో తండ్రి వసీంఖాన్ రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు, సీసీ ఫుటేజీల ఆధారాలతో నిందితులను పట్టుకున్నారు.

నిందితులను ప్రశ్నించిన పోలీసులకు విస్తుపోయే విషయాలను వారు వెల్లడించారు. కిడ్నాప్‌ చేసిన బాలుడిని హత్య చేసినట్లు అంగీకరించారు. అనంతరం జింకలవాడ సమీపంలోని ఓ నాలాలో మృతదేహాన్ని వేసినట్లు నిందితులు అంగీకరించారు. దీంతో గురువారం అర్ధరాత్రి పోలీసులు స్థానికుల సహాయంతో నాలాలో వెతికారు. ఓ ప్లాస్టిక్‌ సంచిలో మృతదేహం ఉన్నట్లు గుర్తించి వెలికి తీశారు. బాలుడిని హత్య చేసిన నిందితులు.. ఎముకలను ఎక్కడిక్కడ విరిచి ఓ బక్కెట్‌లో కుక్కారు. అనంతరం ఆ బక్కెట్‌ను ప్లాస్టిక్‌ సంచిలో వేసి వెళ్లి నాలాలో విసిరేసినట్లు తెలిసింది. బాలుడిని నరబలి ఇచ్చినట్లుగా బస్తీవాసులు అనుమానిస్తుండగా.. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.