“మీరు మారిపోయారు సార్‌..”

vijayawada: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని ఏపీ(Ap)లో మరోసారి రుజువైంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(tdp chief chandrababu naidu) పుట్టిన రోజు(birthday) సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి(ycp mp vijay sai reddy) శుభాకాంక్షలు చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. గతంలో ట్విట్టర్‌ వేదికగా.. విజయ్‌సాయిరెడ్డి.. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌(lokesh)ను టార్గెట్‌ చేసి బండబూతులు తిట్టేవారు. కానీ ఇప్పడు ఆ పరిస్థితులు మారినట్లు కనిపిస్తున్నాయి. ఇదంతా ఎందుకో తెలియదు.. వైసీపీ పార్టీ కార్యక్రమాలకు కూడా ఈ మధ్య విజయసాయి రెడ్డి దూరంగా ఉంటున్నారు. ప్రతిపక్షాలపై కూడా పెద్దగా విమర్శలు చేయట్లేదు. ఆయన మౌనం వెనుక కారణం ఏమో కానీ.. చంద్రబాబుపై కురిపిస్తున్న ప్రేమ చూసి నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. మీరు మారిపోయారు సార్‌ అంటూ.. పొగుడుతున్నారు.

ఇక ఇవాళ విజయసాయి రెడ్డి తన ట్విట్టర్‌(twitter post) వేదికగా.. నారా చంద్రబాబు నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా.. ఆయన సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’ అని ట్వీట్ చేశారు. ఎప్పుడూ చంద్రబాబుని విమర్శించే విజయసాయి రెడ్డికి ఏమైంది.. ఎందుకిలా మారిపోయారో అర్థం కావట్లేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే… సినీనటుడు తారకరత్న ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న నాటి నుంచి సాయి రెడ్డి వైఖరిలో మార్పు వచ్చింది. అప్పట్లో బాలకృష్ణ.. తారకరత్నను బాగా చూసుకుంటున్నాడని కితాబిచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలోనే ఉంటున్న ఆయన… సీఎం జగన్‌ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనట్లేదు. దీంతో జగన్‌కి.. విజయసాయికి మధ్య దూరం పెరిగిందనే టాక్ నడుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం ఆయన మార్క్ ఏమీ కనిపించలేదు. ఇక చంద్రబాబు విషయంలోనూ విజయసాయి వైఖరి మారింది. ఇటీవలి కాలంలో విమర్శలనేవి లేవు. మరి ఈ సాన్నిహిత్యం ఎటువైపునకు దారితీస్తుందో చూడాల్సి ఉంది.