ప్ర‌ముఖ న‌టుడు అల్లు ర‌మేష్ క‌న్నుమూత‌

Hyderabad: ప్ర‌ముఖ న‌టుడు, క‌మెడియ‌న్ అల్లు ర‌మేష్(52)(allu ramesh) హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. నిన్న రాత్రి విశాఖ‌పట్నంలోని త‌న నివాసంలో గుండెపోటుతో ఆయ‌న చ‌నిపోయారు. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు ఆనంద్ ర‌వి వెల్ల‌డించారు. చిరుజ‌ల్లు సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ర‌మేష్‌(allu ramesh).. తోలు బొమ్మ‌లు, మ‌థురా వైన్స్, వీధి, బ్లేడ్ బాబ్జి, నెపోలియ‌న్ వంటి ఎన్నో సినిమాల్లో న‌టించారు. ఆయ‌న చివ‌రి సినిమా రాజేంద్ర ప్ర‌సాద్ న‌టించిన అనుకోని ప్ర‌యాణం. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న వెబ్ సిరీస్ మా విడాకులులోనూ ర‌మేష్ కొన్ని ఎపిసోడ్ల‌లో న‌టించారు. ఈ వెబ్‌సిరీస్‌లో త‌న కూతురు, అల్లుడిని క‌ల‌పాల‌ని ఆయ‌న గుండెపోటు నాట‌కం ఆడ‌తారు. కానీ ఆయ‌న నిజంగానే గుండెపోటుతో ఇంత త్వ‌ర‌గా అంద‌రినీ వ‌దిలి వెళ్లిపోతార‌ని అస్స‌లు అనుకోలేద‌ని ఫ్యాన్స్ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.