ys jagan: ట్రాన్స్‌జెండ‌ర్ల‌కు గుడ్‌ న్యూస్‌

vijayawada: ఏపీ ప్రభుత్వం ట్రాన్స్ జెండర్ల(హిజ్రాలు)(transgenders)కు శుభవార్త చెప్పింది. వారికి గుర్తింపు కార్డుల(id cards)ను జారీ చేయనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా.. వారి సంక్షేమానికి ప్రస్తుత బడ్జెట్ లో రూ. 2 కోట్లు కేటాయించింది. ట్రాన్స్ జెండర్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా ట్రాన్స్ జెండర్లకు మంచి వైద్యం, విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేయనుంది. వారికి సామాజిక భద్రత కల్పించేలా పాలసీని రూపొందించింది. నవరత్నాల ద్వారా హిజ్రాలకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తోంది. వారికి ప్రత్యేకంగా మరికొన్ని చర్యలు చేపట్టింది. వాళ్లు నివసించే ప్రాంతాల్లో మంచినీటి సరఫరా, పారిశుధ్య సదుపాయాలు కల్పిస్తోంది. వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలను కల్పించేదిశగా అడుగులు వేస్తోంది.