YS Sharmila: నా లేఖ TDP చేతికి ఎలా వెళ్లిందో తెలీదు

ys sharmila another letter to jagan

YS Sharmila: తాను వైఎస్ జ‌గన్ మోహ‌న్ రెడ్డికి రాసిన లేఖ‌లు.. ఆస్తికి సంబంధించిన స‌మాచారం తెలుగు దేశం పార్టీ చేతికి ఎలా వ‌చ్చిందో త‌న‌కు నిజంగా తెలీద‌ని అన్నారు APCC చీఫ్ వైఎస్ ష‌ర్మిళ‌. జ‌గ‌న్ 2019 ఎన్నిక‌ల వ‌ర‌కు త‌న అవ‌స‌రం ఉంది కాబ‌ట్టే రూ.200 కోట్లు ఇచ్చాడ‌ని.. అంతేకానీ అందులో ఏమాత్రం ప్రేమ లేద‌ని అన్నారు. జ‌నాలు వైఎస్సార్ బిడ్డ‌ను త‌ప్పుగా అర్థంచేసుకోకూడ‌దు అని చెప్పేందుకే అన్ని వివ‌రాలున్న మరో లేఖ‌లు రిలీజ్ చేస్తున్న‌ట్లు తెలిపారు. తాను తెలుగు దేశం పార్టీ బాణాన్ని కాద‌ని.. ఆ పార్టీ ఎందుకు త‌న విష‌యంలో వేలు పెడుతోందో తెలీడంలేద‌ని అన్నారు. త‌న‌కు ఆస్తి మీద మోజు లేద‌ని.. కానీ త‌న బిడ్డ‌ల‌కు రావాల్సిన ఆస్తి మాత్రం ఇవ్వాల్సిందే అని అన్నారు.