Jagan: ప‌ప్పు లోకేష్‌కు బుద్ధి లేదు

jagan again calls nara lokesh pappu

Jagan: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ను ప‌ప్పు అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. గుంటూరులో స‌హ‌న అనే యువ‌తి ఓ రౌడీ షీట‌ర్ దాడిలో ప్రాణాలు కోల్పోవ‌డంతో జ‌గ‌న్ మృతురాలి కుటుంబాన్ని పరామ‌ర్శించేందుకు వెళ్లారు. ఆ త‌ర్వాత మీడియాతో స‌మావేశ‌మ‌య్యారు.

“” చంద్ర‌బాబు నాయుడు అధికారంలోకి వ‌చ్చిన నాలుగు నెల‌ల్లోనే ఎంద‌రో ఆడ‌పిల్ల‌లు అత్యాచారానికి మ‌ర్డ‌ర్‌కు గుర‌య్యారు. నేను అధికారంలో ఉన్న‌ప్పుడు దిశా యాప్‌ని ప్ర‌వేశ‌పెడితే యాప్ వ‌ల్ల అమ్మాయిల‌కు మంచి ర‌క్ష‌ణ క‌లుగుతోంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఏకంగా 19 అవార్డులు ఇచ్చింది. ఈరోజు ఆ దిశా యాప్‌ని హోంమంత్రి అనిత‌, మంత్రి లోకేష్ కాల్చేసారు. ఈ ప‌ప్పు లోకేష్‌కి అస‌లు బుద్ధి ఉందా? అమ్మాయిల‌కు ర‌క్ష‌ణ ఇచ్చే యాప్‌ని బిల్లుని ఎవ‌రైనా ఇలా కాల్చేస్తారా? మీరు ఎన్ని అక్ర‌మాలు చేస్తారో ఎంత మంది నేర‌స్తుల‌ను కాపాడ‌తారో కాపాడుకోండి. మ‌ళ్లీ వ‌చ్చేది నా ప్ర‌భుత్వ‌మే. అప్పుడు ఒక్కొక్క‌డిని జైల్లో వేయించ‌క‌పోతే చూడండి “” అని హెచ్చ‌రించారు.