MS Raju: అమ్మా రోజా సాక్షిని కాదు మ‌న‌సాక్షిని న‌మ్ముకో

MS Raju asks roja not to trust sakshi

MS Raju: వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న‌ప్పుడు చిత్తూరులో ఓ మ‌హిళ స్నానం చేస్తుంటే సొంత పార్టీ నేతలు, కార్య‌క‌ర్త‌లు వీడియోలు తీసి ఆమెపై అత్యాచారం చేసార‌ని.. అప్పుడు లేవ‌ని రోజా నోరు ఇప్పుడు ఎందుకు లేస్తోంద‌ని ప్ర‌శ్నించారు మ‌డ‌క‌శిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. రోజా సాక్షిని న‌మ్ముకుని బ‌తుకుతోంద‌ని.. ఒక్క‌సారి మ‌న‌సాక్షిని న‌మ్ముకుంటే అన్నీ అర్థ‌మ‌వుతాయ‌ని సెటైర్ వేసారు.

“” అమ్మా రోజా.. సాక్షిని కాదు మ‌న‌సాక్షిని నమ్ముకో. ఆనాడు ఓ మ‌హిళ‌ను మీ పార్టీ వాళ్లే అత్యాచారం చేస్తే ఆమె రోడ్డు మీద‌కు వ‌చ్చి న్యాయం చేయండి అని ఏడ్చింది. అప్పుడు ఏమైపోయావ్? ఇప్పుడు రాష్ట్రంలో చిన్న చిన్న నేరాలు జ‌రుగుతుంటే కిలో మేక‌ప్ వేసుకుని వ‌చ్చి మీడియా ముందు మాట్లాడుతున్నావ్. నువ్వు స‌హ‌జంగానే మంచి న‌టివి కాబ‌ట్టి బ‌య‌ట కూడా న‌టిస్తానంటే కుద‌ర‌దు. మీ అధినేత జ‌గ‌న్‌ది మ‌రో తీరు. ఏద‌న్నా సాయం చేయ‌డానికి రావ‌య్య ఆంటే రాడు కానీ.. ఎవ‌రైనా చ‌నిపోతే అప్పుడు వ‌స్తాడు శ‌వ రాజ‌కీయం చేయ‌డానికి. చిన్న చిన్న నేరాలు జ‌రుగుతున్నా చంద్ర‌బాబు నాయుడు ఎంత స్ట్రిక్ట్‌గా తీసుకుంటున్నారో చూసి నేర్చుకోండి. నువ్వు జ‌బ‌ర్ద‌స్త్ షోలు చేసుకుంటున్న‌ప్పుడు ఆడ‌వారిపై కామెంట్స్ జోక్స్ వేస్తుంటే ఎలా ప‌డి ప‌డి న‌వ్వుకున్నావో అంద‌రూ చూసారు. అలాంటి నువ్వు మ‌హిళ‌ల సంర‌క్ష‌ణ గురించి మాట్లాడుతుంటే న‌వ్వొస్తోంది.

ఇక మా హోంమంత్రి అనిత గారు బాల‌కృష్ణ గారి కాళ్ల‌కు న‌మ‌స్కారం చేస్తే సిగ్గులేని నీతిమాలిన గోరంట్ల మాధ‌వ్‌కు స‌మ‌స్యేంటి? నాలాంటి ద‌ళితుడికి రాజ‌కీయ భ‌విష్య‌త్తు క‌ల్పించిన పార్టీ తెలుగు దేశం. ఆ పార్టీని స్థాపించిన దివంగ‌త నంద‌మూరి తార‌క రామారావు కుమారుడు బాల‌కృష్ణ‌. అలాంటి ఆయ‌న ఆశీర్వాదం మేం త‌ప్ప‌కుండా తీసుకుంటాం. నీకు నొప్పేంటి. ఇంకోసారి నోటికొచ్చిన‌ట్లు మాట్లాడితే మా చేత‌లు కూడా అలాగే ఉంటాయ్. జాగ్ర‌త్త‌. నీ పేరును ఉచ్ఛ‌రించ‌డానికి కూడా సిగ్గుగా ఉంది “” అని మండిప‌డ్డారు.