“న‌న్ను లోప‌లికి గుంజు లోప‌లికి గుంజు”

bandi sanjay drama in front of police

Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజ‌య్ డ్రామా కెమెరాల‌కు చిక్కింది. గ్రూప్ 1 ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై ప్ర‌భుత్వం పున‌రాలోచ‌న చేయాలంటూ విద్యార్థుల‌తో క‌లిసి చ‌లో స‌చివాయం పేరిట‌ బండి సంజ‌య్ ర్యాలీ చేప‌ట్టారు. హైద‌రాబాద్‌లోని అశోక్ న‌గ‌ర్ నుంచి ర్యాలీగా వ‌చ్చిన బండి సంజ‌య్‌ని తెలుగు త‌ల్లి ఫ్లై ఓవ‌ర్ వ‌ద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాంతో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. అయితే పోలీసులు ఎక్కించ‌కుండానే బండి సంజ‌య్ త‌నంత‌ట తానే సేఫ్‌గా జీపులోకి ఎక్కాల‌నుకున్నారు. కానీ కెమెరాలు రికార్డు అవుతున్నాయ‌ని తెలిసి డోర్ ద‌గ్గ‌రున్న పోలీసుతో న‌న్ను లోప‌లికి గుంజు న‌న్ను లోప‌లికి గుంజు అని చెప్పి మ‌రీ వారి చేత బ‌ల‌వంతంగా కారు ఎక్కించిన‌ట్లు బిల్డ‌ప్ ఇవ్వ‌డం కెమెరాల‌కు చిక్కింది. బ‌య‌టికి మాత్రం ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేసారు.

దీనిపై BRS వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ KTR కూడా స్పందించారు. బండి సంజ‌య్ ఉత్తుత్తి నిర‌స‌న చేప‌డుతున్నాడ‌ని తెలిసి తెలంగాణ ప్ర‌భుత్వం ఆయ‌న‌కు హై సెక్యూరిటీ క‌ల్పించింద‌ని.. అస‌లు గ్రూప్ 1 ప‌రీక్షల విష‌యంలో బండి సంజ‌య్ ర్యాలీ చేయ‌డం విడ్డూరంగా ఉంద‌ని అన్నారు. అస‌లు బండి సంజ‌య్ ఏం చదువుకున్నాడ‌ని గ్రూప్ 1 గురించి నిర‌స‌న చేస్తాడ‌ని… ఆయ‌న‌కు పేప‌ర్ లీక్ చేయ‌డం త‌ప్ప ఇంకేం తెలుసు అని సెటైర్ వేసారు.