న‌వ్వులు పూయిస్తున్న శ్రద్ధాంజ‌లి ప్ర‌క‌ట‌న‌

a son funny obituary to his father

Viral News: సాధార‌ణంగా మ‌న ఇంట్లో ఎవ‌రైనా చ‌నిపోతే ఎంత బాధ‌ప‌డ‌తామో అనుభ‌వించేవారికే తెలుసు. కొంద‌రైతే ప్ర‌తి సంవత్స‌రం వారు చ‌నిపోయిన దినాన్ని శ్ర‌ద్ధాంజ‌లి పేరిట ప‌త్రిక‌ల్లో ప్ర‌క‌ట‌న‌లు వేయిస్తుంటారు. అలా శ్ర‌ద్ధాంజ‌లి ప్ర‌క‌ట‌న‌ల్లో నువ్వు మా నుంచి దూర‌మైనా మా గుండెల్లో ఎప్ప‌టికీ నిలిచే ఉంటావు. నీ స్మృతుల‌తో.. అని రాస్తుంటారు. కానీ పై ఫోటోలో క‌నిపిస్తున్న వ్య‌క్తి మాత్రం శ్ర‌ద్ధాంజ‌లి చ‌ద‌వ‌గానే ఫ‌క్కున న‌వ్వుకునేలా ప్ర‌క‌ట‌న వేయించాడు. అమెరికాకి చెందిన రాబ‌ర్ట్ అనే వ్య‌క్తి గ‌తేడాది చ‌నిపోయాడు. ఈ నేప‌థ్యంలో రాబ‌ర్ట్ కొడుకు చార్లెస్ పేప‌ర్లో శ్ర‌ద్ధాంజ‌లి ప్ర‌క‌టన వేయించాడు.

ఆ శ్రద్ధాంజ‌లి ప్ర‌క‌ట‌న‌లో ఏమ‌ని రాసాడో తెలుసా? నా తండ్రి కేథోలిక్ ఫాద‌ర్. దాంతో వియ‌త్నాం యుద్ధం నుంచి త‌ప్పించుకోవ‌డానికి ఐదేళ్ల‌లో ముగ్గురి పిల్లల్ని క‌న్నాడు. అమ్మ రెండేళ్ల కంటే ముందే చ‌నిపోయింది కాబ‌ట్టి మీకు కొంత‌కాలం పాటు మ‌న‌శాంతి ల‌భించింది. ఇప్పుడు మీరు మాతో లేరు కాబ‌ట్టి.. ఇక మీరు దేవుడి త‌ల‌నొప్పి. మాకేం సంబంధం లేదు అని రాసాడు. దాంతో ఆ ప్ర‌క‌ట‌న అమెరికాలో తెగ వైర‌ల్‌గా మారింది. అంద‌రూ శ్ర‌ద్ధాంజ‌లిని ఇలా కూడా ఘ‌టిస్తారా అంటూ సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.