Jagan: ప్ర‌తిప‌క్షంలో ఉంటేనే బాగా ప‌నిచేస్తాం

jagan asks party leaders to improve social media presence

Jagan: మ‌న యుద్ధం చంద్ర‌బాబు నాయుడుతో కాదు.. మ‌న గురించి త‌ప్పుడు క‌థ‌నాలు రాసే రాక్ష‌సుల‌తో అని పార్టీ నేత‌ల‌తో అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడే మ‌రింత ఫోక‌స్‌గా ప‌నిచేయ‌గ‌లుగుతామ‌ని ఆయ‌న అన్నారు. ఈ రోజుల్లో మీడియా ముందుకు వ‌చ్చి మాట్లాడ‌టం కన్నా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండ‌ట‌మే ఎంతో కీల‌కం అని అన్నారు.

“” మీ అంద‌రికీ ఒక్క‌టే చెప్తున్నా. మీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎవ‌రికి వారు సోష‌ల్ మీడియా ఖాతాలు క్రియేట్ చేసుకుని ఎప్ప‌టిక‌ప్పుడు అప్డేట్స్.. త‌ప్పుడు ప్ర‌చారాల‌ను తిప్పి కొట్టేలా పోస్ట్‌లు ఉండాలి. ఈరోజు మ‌న యుద్ధం చంద్ర‌బాబు నాయుడుతో కాదు. మ‌న గురించి ఎవ‌రికి వారు త‌ప్పుడు క‌థ‌నాలు రాసుకుని గోబెల్స్ ప్ర‌చారం చేసే ఈనాడు, ఏబీఎన్, టీవీ 5ల వంటి ఛానెళ్లది. ఈ ఛానెళ్ల‌లో ఏం చెప్తే అదే సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం అవుతోంది. ఈ రాక్ష‌సుల‌ను మ‌నం ఎదుర్కోవాలంటే మ‌న సోష‌ల్ మీడియా కూడా అంతే స్ట్రాంగ్‌గా ఉండాలి అని గుర్తుంచుకోండి. ఇప్పుడు మ‌నం ప్ర‌తిప‌క్షంలో ఉన్నాం. ప్ర‌తిప‌క్షంలో ఉంటేనే బాగా ప‌నిచేస్తాం. మీరేంటో మీరు ప్రూవ్ చేసుకోండి. మీ ప్ర‌మోష‌న్ల సంగ‌తి నేను చూసుకుంటా “” అని తెలిపారు జ‌గ‌న్.