త్వరలో పట్టాలపైకి వందే మెట్రో రైళ్లు

Delhi: కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్(ashwini vaishnaw Minister of Railways) రైలు ప్రయాణికులకు మరో గుడ్‌ న్యూస్‌ చెప్పారు. వంద కిలోమీటర్ల పరిధిలో ఉండే ప్రధాన నగరాలను కనెక్ట్‌ చేసేలా మెట్రో రైల్‌ వ్యవస్థ ‘వందే మెట్రో(vandhe metro)’ను ఈ ఏడాది చివర్లోనే పట్టాలు ఎక్కించనున్నట్లు ప్రకటించారు. దూరంగా ఉండే.. ప్రధాన నగరాలను కనెక్ట్‌ చేస్తూ తీసుకొచ్చిన సెమీ హై స్పీడ్‌ రైళ్లను ‘వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌'(Vandhe bharath express) పేరుతో తీసుకుని రాగా… వాటికి ప్రజల నుంచి మంచి ఆధరణ లభిస్తోంది. ఇక ఇప్పుడు తక్కువ దూరంలోని ప్రధాన నగరాలను అనుసంధానించేలా వందే మెట్రో రైళ్లను తీసుకురాబోతున్నట్లు తెలిపారు. వందే భారత్‌తో పోలిస్తే వందే మెట్రో డిఫరెంట్‌గా ఉంటుంది. డిసెంబర్‌ కల్లా ఇది సిద్ధమవుతుందని పేర్కొన్నారు. అంతేకాదు.. వందే భారత్‌కు వస్తున్న స్పందనకు అనుగుణంగానే వందే మెట్రోలను తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఉత్తర ప్రదేశ్‌(up) కాన్పూర్‌-లక్నో(90 కిలోమీటర్ల దూరం)(kanpur- lucknow) నడుమ తొలి రైలును ప్రయోగాత్మకంగా పట్టాలెక్కించాలని రైల్వే శాఖ భావిస్తున్నట్లు సమాచారం.

లోకల్‌ రైళ్ల కంటే మెరుగైన రవాణా అందించే ఉద్దేశంతో వందే మెట్రో తీసుకువస్తున్నట్లు రైల్వేశాఖ చెబుతోంది. వేగంగా, రూట్‌లో ఫ్రీక్వెంట్‌గా సర్వీసులను నడపాలని నిర్ణయించుకుంది. తద్వారా ఉద్యోగులకు, విద్యార్థుల ప్రయాణాలకు వందే మెట్రో తోడ్పడుతుందని రైల్వే మంత్రి వైష్ణవ్‌ తెలిపారు. ఎనిమిది కోచ్‌లతో వందే మెట్రో రైళ్లను నడపాలని భావిస్తున్నామని.. ఇప్పటికే చెన్నైలోని ఇంటీగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీకి, లక్నోలోని రీసెర్చ్‌ డిజైన్‌ అండ్‌ స్టాండర్డ్‌ ఆర్గనైజేషన్‌కు రైల్వే శాఖ ఆర్డర్‌లు ఇచ్చినట్లు తెలుస్తోంది.