విజ‌య‌వాడ క‌మిష‌న‌ర్‌గా ఆమ్ర‌పాలి?

amrapali the new gvmc commissioner

Amrapali: GHMC క‌మిష‌న‌ర్‌గా ఉన్న కాట ఆమ్ర‌పాలిని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ GVMC (గ్రేట‌ర్ విజ‌య‌వాడ మున్సిప‌ల్ కార్పొరేష‌న్) క‌మిష‌న‌ర్‌గా నియ‌మించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం కేటాయించిన రాష్ట్రాల్లోనే రిపోర్ట్ చేయాల‌ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప‌ర్సోనెల్ అండ్ ట్రైనింగ్ విభాగం తెలంగాణ‌లో ప‌నిచేస్తున్న న‌లుగురు ఐఏఎస్ అధికారుల‌ను ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. ఆమ్ర‌పాలి, రొనాల్డ్ రోస్, వాకాటి క‌రుణ, వాణిప్ర‌సాద్‌లు ఈరోజు నుంచి ఏపీలో రిపోర్ట్ చేయ‌నున్నారు. ఇప్ప‌టికే వారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎస్ నీర‌బ్ కుమార్ ప్రసాద్‌ను క‌లిసారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన సృజ‌న‌, హ‌రికిర‌ణ్, శివ‌శంక‌ర్ తెలంగాణ సీఎస్ శాంతికుమారికి రిపోర్ట్ చేసారు. ఈ నేప‌థ్యంలో మొన్న‌టివ‌ర‌కు GHMC క‌మిష‌న‌ర్‌గా ప‌నిచేసిన ఆమ్ర‌పాలిని GVMC క‌మిష‌న‌ర్‌గా నియ‌మించాల‌ని లోకేష్ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.