ఇక బాబు చుట్టూ ఆ కమాండోలు క‌నిపించ‌రు

chandrababu naidu to get crpf as security

Chandrababu Naidu: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు భ‌ద్ర‌త‌లో మార్పులు జ‌ర‌గ‌నున్నాయి. ఆయ‌న చుట్టూ ఉండే బ్లాక్ క‌మాండోలు ఇక క‌నిపించ‌రు. వారిని NSG క‌మాండోలు అని పిలుస్తారు. త్వ‌ర‌లో బాబుకు NSG కాకుండా CRPF సిబ్బంది భ‌ద్ర‌త క‌ల్పిస్తారు. ఈ మేర‌కు కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది. చంద్ర‌బాబు నాయుడుతో పాటు దేశంలోని ఇత‌ర‌ VVIPపీల‌కు కూడా CRPF సిబ్బందే భ‌ద్ర‌త క‌ల్పిస్తారు. ఈ సెక్యూరిటీ Z+ అంటారు.

అయితే ఈ భ‌ద్ర‌త మార్పులు జ‌ర‌గ‌డానికి మ‌రో రెండు మూడు నెల‌ల స‌మ‌యం ప‌డుతుంది. చంద్ర‌బాబు నాయుడుతో పాటు ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్, మాజీ ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి మాయావ‌తి, కేంద్ర‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీనియ‌ర్ నేత ఎల్కే అడ్వాణీ, మాజీ అస్సాం ముఖ్య‌మంత్రి స‌ర్బానంద సోనోవాల్, మాజీ ఛ‌త్తీస్‌గ‌డ్ ముఖ్య‌మంత్రి ర‌మ‌ణ్ సింగ్, మాజీ సీనియ‌ర్ కాంగ్రెస్ నేత గులాం న‌బీ ఆజాద్, క‌శ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి ఫారూక్ అబ్దుల్లాల‌కు కూడా CRPF సెక్యూరిటీ క‌ల్పించ‌నున్నారు.