జైలులో రామాయణ నాటకం.. సీతను వెతకటానికి వెళ్లి ఖైదీల పరార్

prisoners escape while doing ramayana drama

Viral News: జైలులో వింత ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఉత్త‌రాఖండ్‌లోని హ‌రిద్వార్ జైలులో ద‌స‌రా సంద‌ర్భంగా రామాయణ నాటకం వేయించారు. రావణుడు.. సీతను అపహరించుకుపోయిన సన్నివేశం ముగిసిన తరువాత వానర వేషం వేసిన వారు సీతని వెతకడం మొదలు పెట్టారు. ఆ సమయంలో ఖైదీలు పంకజ్, రాజ్ కుమార్ ఇద్దరూ జైలు గోడపై వెతకడం మొదలు పెట్టారు. అది నాటకంలో భాగమని ప్రేక్షకులు, పోలీసులు నోరెళ్ళబెట్టి చూస్తుండగా.. వారు ఇద్దరూ గోడ దూకి పారిపోయారు. చివరకు సీత దొరికినప్పటికీ.. వారిద్దరూ మాత్రం దొరకలేదు. బాగా ఆడారు క‌దూ..!