Viral News: కొడుక్కి ప‌రాయి వ్య‌క్తితో “ఆ” స‌మ‌యంలో దొరికిన త‌ల్లి

son caught mother having affair

Viral News: క‌న్న కొడుకు చూస్తాడ‌న్న సిగ్గు లేదు. భ‌ర్త ఉన్న‌ప్ప‌టికీ ప‌రాయి వ్య‌క్తితో అక్ర‌మ సంబంధం పెట్టుకోవ‌డ‌మే కాకుండా.. త‌న ఎఫైర్‌కు అడ్డుగా ఉన్నాడ‌ని బిడ్డ‌ను దారుణంగా చంపేసింది ఓ క‌సాయి తల్లి. ఈ దారుణ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లో చోటుచేసుకుంది. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌కి చెందిన సుమిత్ర త‌న భ‌ర్త‌, ఇద్ద‌రు కొడుకుల‌తో క‌లిసి కూలీ ప‌ని కోసం మ‌హారాష్ట్ర‌లోని వాగ్మ‌రే వాస్తి ప్రాంతానికి వెళ్లిపోయారు. ఈ నేప‌థ్యంలో సుమిత్ర అదే ప్రాంతానికి చెందిన ప్రఫుల్లా అనే వ్య‌క్తితో అక్ర‌మ సంబంధం పెట్టుకున్నారు. ఈ విష‌యం సుమిత్ర కొడుకు అనిల్‌కి తెలుసు.

ఇంకోసారి ఇలాంటి ప‌నులు చేస్తే బాగోద‌ని వారించాడు కూడా. ఈ నేప‌థ్యంలో నిన్న రాత్రి అనిల్ ప‌ని చేసుకుని ఇంటికి వెళ్లగా.. త‌న త‌ల్లిని మ‌రో వ్య‌క్తితో చూడ‌కూడ‌ని ప‌రిస్థితుల్లో చూసాడు. దాంతో వారిపై గ‌ట్టిగా కేక‌లు వేసాడు. ఎక్క‌డ న‌లుగురికీ తెలుస్తుందో అని సుమిత్ర అనిల్‌ని కొట్టి చంపేసింది. దాంతో ప్ర‌ఫుల్లా భ‌య‌ప‌డి అక్క‌డి నుంచి పారిపోయాడు. కాసేప‌టికే వ‌చ్చిన రెండో కొడుకు సునీల్ అనిల్ మృత‌దేహం చూసి వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేసాడు. పోలీసులు సుమిత్రను అరెస్ట్ చేసారు.