తార‌క్‌, బ‌న్నీ, సామ్‌.. ఓ ప్యాన్ ఇండియా సినిమా!

Hyderabad: ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌(RRR) సినిమాతో ఎన్టీఆర్(NTR), పుష్ప(Pushpa) సినిమాతో అల్లు అర్జున్(Allu Arjun) పాన్ ఇండియా హీరోలుగా పేరు తెచ్చుకున్నారు. ఇక, ఫ్యామిలీ మ్యాన్(Family Man) వెబ్ సిరీస్‌తో బాలీవుడ్‌(Bollywood) ప్రేక్షకులకు దగ్గరయ్యారు సమంత(Samantha). శాకుంతలం(Shaakunthalam) సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకులను పలకరించారు సమంత. ఎన్టీఆర్, అల్లు అర్జున్, సమంత కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కనుందనే వార్తలు బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

ఎన్టీఆర్(ntr), అల్లు అర్జున్(allu arjun), సమంత(samantha) కాంబినేషన్‌లో పాన్ ఇండియా రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో మైథలాజికల్ సినిమాను తెరకెక్కించనున్నారనే వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ‘ది ఇమ్మోర్టల్ అశ్వద్ధామ’ కథతో సినిమాను ప్లాన్ చేస్తున్నారని, ఆ ప్రాజెక్ట్‌ కు నేషనల్ అవార్డు గెలుచుకున్న బాలీవుడ్ డైరెక్టర్‌‌ ఆదిత్య ధర్ దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది. ఈ భారీ ప్రాజెక్టును జియో స్టూడియోస్ నిర్మించనున్నట్టు సమాచారం.

ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం, ‘ది ఇమ్మోర్టల్ అశ్వద్ధామ’ సినిమాలో మెయిన్‌లీడ్‌ కోసం ముందుగా రణ్‌వీర్‌ ‌సింగ్‌(Ranveer Singh), విక్కీ కౌశల్‌(Vicky Koushal)ను ఎంపిక చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఈ భారీ ప్రాజెక్టు నుంచి వారిద్దరూ తప్పుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలోని ప్రధాన పాత్రకు జూనియర్ ఎన్టీఆర్ లేదా అల్లు అర్జున్‌ను ఎంపిక చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. కాగా, ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ రోల్ కోసం సమంతను అడుగుతున్నారని తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్టుపై వస్తున్న వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక సమాచారం వచ్చే వరకు ఆగాల్సిందే.