Eluru: ఒక పందెం కోడి.. కుటుంబం మొత్తం బలి

a hen led to the death of a family in eluru

Eluru: ఒక పందెం కోడి యావ‌త్ కుటుంబాన్ని బ‌లి తీసుకున్న ఘ‌ట‌న ఏలూరులో చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా పెదవేగి మండలం కవ్వకుంటలో కోడికి ఈత నేర్పడానికి వెంకటేశ్వరరావు (45) అనే వ్య‌క్తి త‌న ఇద్ద‌రు కుమారులు మణికంఠ (15), సాయి కుమార్ (13) ల‌తో క‌లిసి కాలువలోకి దిగారు. ముగ్గురికీ ఈత రాక మునిగి చనిపోయారు. భర్త, కుమారులు ఒకేసారి అకాల మ‌ర‌ణం చెందడంతో భార్య దేవి(36) భరించలేకపోయింది. వారినే తలుచుకుంటూ తీవ్ర మాన‌సిక‌ వేదనకు గురైంది. శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మరుగుదొడ్డిలో ఇనుప రాడ్డుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.