T20I Series: క‌ళ్ల‌ల్లో ఓడించాన‌నే క‌సి

arshdeep singh death stare during T20I Series goes viral

T20I Series: T20I సిరీస్‌లో భాగంగా బుధ‌వారం జ‌రిగిన మ్యాచ్‌లో బౌల‌ర్ అర్ష్‌దీప్ సింగ్ చూపు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. డెత్ స్టేర్ అంటూ నెటిజ‌న్లు ఆ చూపులో ఉన్న భావం గురించి కామెంట్స్ చేస్తున్నారు. నిన్న బంగ్లాదేశ్‌కి టీమిండియా ఇచ్చిన టార్గెట్ 222 ప‌రుగులు. భార‌త యువ క్రికెట‌ర్లే నిన్న త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో దంచేసారు. మ‌న తెలుగోడు నితీష్‌కుమార్ రెడ్డి 34 బంతుల్లో త‌న రెండో T20I సిరీస్‌లో 50 దాటేసి 74 ప‌రుగులు చేసాడు. ఇక రింకూ సింగ్ 29 బంతుల్లో 53 ప‌రుగులు తీసాడు. అన్నిటికంటే హైలైట్‌గా నిలిచింది అర్ష్‌దీప్ సింగ్ కంటి చూపు. ప‌ర్వేజ్ హుస్సేన్ ఎమోన్ వికెట్ తీసిన అర్ష్‌దీప్ అతని వైపు డెత్ స్టేర్ (భ‌యంక‌ర‌మైన లుక్) ఇవ్వ‌డం కెమెరాల్లో చిక్కింది. మ్యాచ్‌లో అవుట్ అయ్యానన్న బాధ కంటే ఆ క్రికెట‌ర్‌కు అర్ష్‌దీప్ సింగ్ ఇచ్చిన లుక్ ఎప్ప‌టికీ గుర్తుండిపోతుంది అంటూ నెటిజ‌న్లు తెగ కామెంట్స్ పెడుతున్నారు.