Annamayya: సీఐ తల్లిని కిడ్నాప్ చేసి చంపిన దుండగుడు

man kidnaps ci mother and kills her

Annamayya: అన్నమయ్య జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. అప్పు ఎక్క‌డ తీర్చాల్సి వ‌స్తుందో అని ఏకంగా సీఐ త‌ల్లినే కిడ్నాప్ చేసి దారుణంగా చంపేసాడు ఓ దుండ‌గుడు. ధర్మవరం వన్ టౌన్ పోలీస్ స్టేష‌న్‌లో ప‌నిచేస్తున్న‌ సీఐ తల్లి స్వర్ణకుమారి.. ఎదురింట్లో ఉంటున్న వెంక‌టేష్ అనే యువ‌కుడికి భారీగా న‌గ‌దు అప్పుగా ఇచ్చింది. కొద్ది రోజుల్లో ఇచ్చేస్తాన‌ని వెంక‌టేష్ బుకాయిస్తూ వ‌చ్చాడు. ఈ నేప‌థ్యంలో ఇద్ద‌రి మ‌ధ్య కొంత‌కాలంగా గొడ‌వ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో సెప్టెంబర్ 29న ఉదయం వెంకటేష్‌తో కలిసి స్వర్ణకుమారి ఓ స్వామి వ‌ద్ద‌కు పుంగనూరుకు వెళ్లింది ఇదే అదునుగా వెంకటేష్ స్వర్ణకుమారిని కిడ్నాప్ చేసి ఆ తర్వాత హత్య చేశాడు. మ‌ద‌న‌ప‌ల్లి టూ టౌన్ పరిధిలో స్వర్ణకుమారి శవాన్ని పాతిపెట్టాడు. స్వర్ణకుమారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టంకు పంపించారు. నిందితుడు వెంకటేష్‌ను పోలీసులు కర్ణాటకలో అదుపులోకి తీసుకున్నారు.