Duvvada Srinivas: శ్రీవారి సేవ‌లో దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురి

duvvada srinivas divvela madhuri in tirumala

Duvvada Srinivas: వైఎస్సార్ కాంగ్రెస్ నేత దువ్వాడ శ్రీనివాస్.. అత‌ని స‌న్నిహితురాలు దివ్వెల మాధురి క‌లిసే శ్రీవారి ద‌ర్శ‌నంలో పాల్గొన‌డం వైర‌ల్‌గా మారింది. ఈరోజు వారిద్ద‌రూ తిరుమ‌ల శ్రీవారిని క‌లిసే ద‌ర్శించుకున్నారు. కొంత‌కాలం పాటు దువ్వాడ శ్రీనివాస్, అత‌ని భార్య వాణి మ‌ధ్య పోరు న‌డిచిన సంగ‌తి తెలిసిందే. త‌న‌తో కాకుండా శ్రీనివాస్ మాధురితో అక్ర‌మ సంబంధం పెట్టుకున్నాడ‌ని.. ఆమెతోనే ఉంటున్నాడంటూ వాణి త‌న కూతురితో క‌లిసి రెండు వారాల పాటు శ్రీనివాస్ ఇంటి ముందే ధ‌ర్నా చేసారు.

ఆ త‌ర్వాత శ్రీనివాస్.. తాను ఉంటున్న ఇంటిని మాధురి పేరిట రిజిస్ట్రేష‌న్ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. వాణి త‌న కూతురితో స‌హా శ్రీనివాస్ ఇంటికి ముందు గొడ‌వ చేసింది. మాధురి పేరిట ఎలా ఇంటిని రాస్తారు అని నానా హంగామా చేసింది. ఆ త‌ర్వాత కోర్టులో తేల్చుకుంటాను అంటూ వెళ్లిపోయింది. అయితే.. త్వ‌ర‌లో తామిద్ద‌రిపై ఓ సినిమా కూడా రాబోతోంద‌ని ఇటీవ‌ల మాధురి ప్ర‌క‌టించారు. త‌మ మ‌ధ్య ఉన్న సంబంధం ఏంటో త్వ‌ర‌లో ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ వెల్ల‌డిస్తాన‌ని మాధురి అన్నారు. మాధురికి ఆల్రెడీ వేరే వ్య‌క్తితో వివాహ‌మై ముగ్గురు పిల్ల‌లు ఉన్నారు. మాధురి త‌న భ‌ర్త‌తో విడిపోయారు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్‌తో ఉంటున్న‌ట్లు ప‌రోక్షంగా ఒప్పుకున్నారు.