తిరుపతి విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

tirupati airport gets bomb threat

Tirupati: తిరుపతి విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ రావ‌డం సంచ‌ల‌నంగా మారింది. తిరుపతి – రేణిగుంట విమానాశ్రయానికి బాంబు ఉందంటూ అధికారులకు ఒక‌రు కాల్ చేసి బెదిరింపుల‌కు పాల్ప‌డ్డారు. దీంతో ఎయిర్ పోర్ట్ అథారిటీ అధికారులు ఏర్పేడు పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై రాత్రికి రాత్రే విస్తృత తనిఖీలు చేపట్టారు. అయితే ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి బాంబు ఆధారాలు క‌నిపించ‌లేదు.