Tirumala: అన్నదాన కేంద్రంలో పెరుగు అన్నంలో జెర్రి

centepede found in tirumala annadana satram

Tirumala: తిరుమల ల‌డ్డూ వివాదం సంచ‌ల‌నంగా మారిన నేప‌థ్యంలో మ‌రో ఘ‌ట‌న చోటుచేసుకుంది. TTD మాధవ నిలయం అన్నదాన కేంద్రంలో వ‌డ్డించిన పెరుగు అన్నంలో జెర్రి క‌నిపించింది. అన్నదాన కేంద్రంలో భోజనం చేస్తున్న భక్తుని ఆకులో జెర్రి కనపడటంపై TTD యాజమాన్యాన్ని భ‌క్తులు ప్ర‌శ్నించారు. TTD సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానం చెప్పడమే కాకుండా త‌మ‌ని వెళ్లిపోమ‌ని గ‌ద‌మాయించార‌ని భ‌క్తులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలి భక్తుల డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ ఉదయమే భక్తలతో నడవడిక, అన్నదానంపై TTD అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చ‌రించిన నేప‌థ్యంలో ఇలాంటి ఘ‌ట‌న చోటుచేసుకోవ‌డం గ‌మ‌నార్హం.