IND vs BAN 2nd Test: చరిత్ర సృష్టించిన టీమిండియా

team india creates history at IND vs BAN 2nd Test

IND vs BAN 2nd Test: ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఇండియా వ‌ర్సెస్ బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా చ‌రిత్ర సృష్టించింది. ఫాస్టెస్ట్ టీం 50గా రికార్డు నెల‌కొల్పింది. కాన్పూర్‌లో జ‌రిగిన మ్యాచ్‌లో టీమిండియా 3 ఓవ‌ర్ల‌లో 18 బాల్స్‌లో 51 ప‌రుగులు తీసి చ‌రిత్ర సృష్టించింది. మొన్న‌టి వ‌ర‌కు ఈ రికార్డు ఇంగ్లాండ్‌కి ఉంది. జులైలో వెస్టిండీస్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 4.2 ఓవ‌ర్ల‌లో 26 బంతుల్లో 50 ప‌రుగులు తీసి ఇంగ్లాండ్ హిస్ట‌రీ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆ రికార్డును మ‌నోళ్లు తిర‌గ‌రాసారు. టీమిండియా ఈ రికార్డు నెల‌కొల్ప‌డానికి కార‌ణం రోహిత్ శ‌ర్మ‌, య‌శ‌స్వి జైస్వాల్. రోహిత్ శ‌ర్మ 6 బంతుల్లో 3 సిక్సులు 1 ఫోర్ బాది 19 ప‌రుగులు తీయ‌గా.. జైస్వాల్ 13 బంతుల్లో ఆరు ఫోర్లు 1 సిక్స్ బాది 30 ప‌రుగులు తీసాడు.