Jagan Tirumala Visit: “కాలు నొప్పి రాలేనని చెప్పు”

did bharathi stopped jagan from tirumala visit

Jagan Tirumala Visit: ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మొత్తానికి తిరుమ‌ల పర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్నారు. ఈరోజు జ‌గ‌న్ తిరుమ‌ల‌కు కాలి న‌డ‌క‌న వెళ్తార‌ని వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు వెల్ల‌డించారు. కానీ ఆయ‌నకు కాలు నొప్పి ఉండ‌టంతో వాహ‌నంలోనే తిరుమ‌లకు వెళ్తార‌ని అన్నారు.  ఆ ప‌ర్య‌ట‌న కూడా జ‌రుగుతుందో లేదో సందేహ‌మే. నిన్న జ‌గ‌న్ ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ త‌న మ‌తం మాన‌వ‌త్వం అని డిక్ల‌రేషన్‌లో రాసుకోవాల‌ని అన్నారు.

అయితే.. జ‌గ‌న్ కాలిన‌డ‌క‌న తిరుమ‌లకు వెళ్ల‌క‌పోవ‌డానికి కార‌ణం ఆయ‌న స‌తీమ‌ణి భార‌తి రెడ్డేన‌ట‌. ఈ విష‌యాన్ని తెలుగు దేశం పార్టీ నేత ఆనం వెంక‌ట‌ర‌మ‌ణ రెడ్డి అన్నారు. భార‌తి క‌రుడుగ‌ట్టిన క్రిస్టియ‌న్ అని అందుకే ఆమె ఆల‌యాల‌కు జ‌గ‌న్‌తో క‌లిసి వెళ్లేవారు కాద‌ని అన్నారు. ఆల‌యానికి భార‌తి రెడ్డి రాదు కాబ‌ట్టే ఆమె కోసం ఏకంగా తిరుమ‌ల సెట్‌నే వేసేసాడ‌ని అన్నారు. తిరుమ‌ల‌కు కాలి న‌డ‌క‌న వ‌ద్ద‌ని.. కార‌ణం అడిగితే కాలు నొప్పి అని చెప్పు అని భార‌తే జ‌గ‌న్‌కు స‌ల‌హా ఇచ్చింద‌ని ఆనం ఆరోపించారు.