Jagga Reddy: BJP కుట్ర‌.. చంద్ర‌బాబు, జ‌గ‌న్‌కి అర్థంకావ‌ట్లేదు

jagga reddy alleges bjp plan in tirumala laddoo issue

Jagga Reddy: భార‌తీయ జ‌న‌తా పార్టీ కుట్రతోనే తిరుపతి లడ్డు వివాదం నెల‌కొంద‌ని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ నేత జ‌గ్గారెడ్డి. BJP డైరెక్ష‌న్‌లో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నార‌ని ఆరోపించారు. TDPకి, YSRCPకి గొడవ పెట్టి సీట్లు పెంచుకునే వ్యూహంలో BJP ఉంద‌ని అన్నారు. ప్రత్యేక హోదా తీసుకురావడంలో చంద్రబాబు, జగన్ ఇద్దరు పూర్తిగా విఫలమయ్యారని ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం, పోలవరం నిర్మాణం పూర్తి చేయడం రెండు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమ‌ని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం ప‌డ‌తార‌ని జ‌గ్గారెడ్డి ఆశాభావం వ్య‌క్తం చేసారు.