Tirumala: ల‌డ్డూ వివాదం వేళ పెరిగిన విక్ర‌యాలు

tirumala laddoo sale increases

Tirumala: ఓ ప‌క్క తిరుమ‌ల ల‌డ్డూ త‌యారీ విష‌యంలో దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతున్న నేప‌థ్యంలో ల‌డ్డూ విక్ర‌యాలు పెరిగ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అధికారిక వివ‌రాల ప్ర‌కారం.. సెప్టెంబ‌ర్ 19న 3.59 ల‌క్ష‌ల ల‌డ్డూలు విక్ర‌యమ‌య్యాయి. 20న స్వ‌ల్పంగా తగ్గి 3.16 విక్ర‌యం అయ్యాయి. కానీ నిన్న మాత్రం అత్య‌ధికంగా 3.66 ల‌డ్డూలు విక్ర‌యం అయిన‌ట్లు అధికారులు తెలిపారు. దీనిని బ‌ట్టే అర్థ‌మ‌వుతోంది తిరుమ‌ల ల‌డ్డూకి భ‌క్తుల గుండెల్లో ఎలాంటి స్థానం ఉందో.