Terrorists: భార‌త్‌లో 900 మంది ఉగ్ర‌వాదులు

900 Terrorists are in india

Terrorists: భార‌త్‌లో ఉగ్ర‌వాదుల సంఖ్య పెరిగింది. ప్ర‌స్తుతానికైతే 900 మంది ఉగ్ర‌వాదులు భార‌త్‌లో చొర‌బ‌డ్డారు. వీరంతా మ‌య‌మ్మార్‌, మ‌ణిపూర్ మార్గంలో భార‌త్‌లోకి అక్ర‌మంగా ప్ర‌వేశించారు. మ‌ణిపూర్ భ‌ద్ర‌తా స‌ల‌హారు కుల్దీప్ సింగ్.. ఈ ఉగ్ర‌వాదులు ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నార‌ని హెచ్చ‌రించారు. దాంతో మ‌య‌న్మార్ స‌రిహ‌ద్దులోని కొండ ప్రాంతాల్లో భారీగా పోలీసులు బందోబ‌స్తుగా ఉన్నారు. ఆల్రెడీ ఉన్న‌వారు కాకుండా ఎక్కువ మొత్తంలో సెక్యూరిటీ బ‌ల‌గాల‌ను పిలిపించార‌ని అన్నారు. త‌మ ద‌గ్గ‌ర ఉన్న ఉగ్ర‌వాదుల లిస్ట్‌ని బ‌ట్టి చూస్తే వారికి డ్రోన్స్, మిస్సైల్స్ వాడ‌టం బాగా తెలుసని చెప్పారు. ఏ వ‌స్తువైనా ఎవ‌రైనా అనుమానాస్పదంగా క‌నిపిస్తే వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించాల‌ని స్థానికుల‌ను అప్ర‌మ‌త్తం చేసారు.