Kethireddy TTD Issue: అది నిజ‌మైతే సర్వ‌నాశ‌నమైపోతారు

Kethireddy TTD Issue: తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి, యానిమ‌ల్ కొవ్వును వాడిన‌ట్లు ల్యాబ్ రిపోర్టులు బ‌య‌టికి వ‌చ్చిన నేప‌థ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేత కేతిరెడ్డి వెంక‌ట‌రామిరెడ్డి స్పందించారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌మ నాయకుడు జ‌గ‌న్ మీద చేయ‌కూడ‌ని ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని.. అందులో వాస్త‌వం ఉంటే ల‌డ్డూని అప‌విత్రం చేసిన వారు స‌ర్వ‌నాశ‌నం అయిపోతార‌ని.. కానీ అది అబ‌ద్ధం అని తేలితే ఆరోప‌ణ‌లు చేసిన వారిని ఆ శ్రీవారే చూసుకుంటార‌ని అన్నారు.