Poonam Kaur: త్రివిక్ర‌మ్‌పై ఫిర్యాదు చేస్తే ప‌ట్టించుకోలేదు

Poonam Kaur: కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ ఓ యువతిపై పాల్ప‌డిన లైంగిక వేధింపుల అంశం బ‌య‌టికి రావ‌డంతో టాలీవుడ్‌ను ఊపేసింది. వెంట‌నే దీనిపై స్పందించిన కొరియోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ జానీ మాస్ట‌ర్‌పై చ‌ర్య‌లు తీసుకున్నారు. జ‌న‌సేన కార్య‌క‌లాపాల నుంచి కూడా ఆయ‌న్ను దూరం పెట్టారు. ఈ నేప‌థ్యంలో న‌టి పూన‌మ్ కౌర్ షాకింగ్ ట్వీట్ చేసింది. ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌పై గ‌తంలో ఇలాగే ఫిర్యాదు చేస్తే ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేద‌ని అన్నారు. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ త‌న‌ను అవ‌కాశాల పేరుతో మోసం చేసార‌ని ఎప్ప‌టి నుంచో పూన‌మ్ ఆరోపిస్తున్నారు. కానీ ఆమె మాట‌ల‌ను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. క‌నీసం ఇప్పుడైనా ఎవ‌రైనా త‌న‌కు సాయం చేస్తారేమో అని అంటున్నారు. రాజ‌కీయ ప్ర‌లోభాల‌కు లోబ‌డి మౌనంగా అన్నీ భ‌రించాన‌ని.. ఇప్పుడు జానీ విష‌యంలో స్పందిస్తున్నవారంతా త్రివిక్ర‌మ్ విష‌యంలోనూ ప్ర‌శ్నించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.