Duvvada Srinivas: భార్య‌ షాక్స్.. మాధురి రాక్స్.. ట్విస్ట్ ఇచ్చిన శ్రీనివాస్

big twist in duvvada srinivas family drama

Duvvada Srinivas: వైఎఎస్సార్ కాంగ్రెస్ టెక్క‌లి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ డ్రామా విష‌యంలో బిగ్ ట్విస్ట్ బ‌య‌ట‌పడింది. కొంత‌కాలంగా శ్రీనివాస్ ఉంటున్న ఇంటిని ఆయ‌న భార్య దువ్వాడ వాణి, కూతురు ఆక్ర‌మించుకుని ఉండటంతో ఆయ‌న బిక్కు బిక్కుమంటూ ఇంటి నుంచి బ‌య‌టికి కూడా రాలేక‌పోయాడు. ఆ ఇంటిని వాణి త‌న పేరు మీద రాయ‌మంటున్నార‌ని.. త‌న‌కు మిగిలినది ఏదైనా ఉందంటే అది ఈ ఒక్క ఇల్లు మాత్ర‌మే అని శ్రీనివాస్ వెల్ల‌డించాడు.

ఈ నేప‌థ్యంలో రెండు రోజుల క్రితం శ్రీనివాస్ స‌న్నిహితురాలైన దివ్వెల మాధురి అత‌ని ఇంట్లో ప్ర‌త్య‌క్ష‌మ‌వ‌డం వైర‌ల్‌గా మారింది. శ్రీనివాస్ ఇంటి మేడ‌పై అటూ ఇటూ తిరుగుతూ ఫోన్ మాట్లాడుతున్న ఫోటోలు బ‌య‌టికి రావ‌డంతో వాణి ఆమె కూతురిని తీసుకొచ్చి ఇంటి ముందు పెద్ద ర‌చ్చ చేసింది. దాంతో పోలీసులు వాణిని అడ్డుకున్నారు. ఈ నేప‌థ్యంలో వారం రోజుల వ్య‌వ‌ధిలోనే శ్రీనివాస్ ఆ ఇంటిని మాధురి పేరిట రాసేసాడ‌ట‌. ఈ విష‌యాన్ని మాధురి మీడియా ద్వారా వెల్ల‌డించారు. ఈ నెల 6న శ్రీనివాస్ ఉంటున్న ఇంటిని తాను కొనుగోలు చేసిన‌ట్లు మాధురి వెల్ల‌డించారు. త‌న ఇంట్లో తాను ఉండ‌క ఇంకెవరు ఉంటార‌ని మాధురి ప్ర‌శ్నించారు. శ్రీనివాస్, వాణిల‌కు ఏమ‌న్నా స‌మ‌స్య‌లు ఉంటే అది వారు వారు తేల్చుకోవాలి కానీ త‌న ఇంటి ముందుకు వ‌చ్చి గొడ‌వ వేసుకోవ‌డం ఏంట‌ని మండిప‌డ్డారు.

శ్రీనివాస్ త‌న ఇంటిని మాధురి పేరిట రిజిస్ట్రేష‌న్ చేసిన‌ట్లు తెలీడంతో వాణి, ఆమె కూతురు షాక‌య్యారు. ఆ ఇంట్లోకి వెళ్లేందుకు శుక్ర‌వారం కోర్టు త‌న‌కు ప‌ర్మిష‌న్ ఇచ్చింద‌ని.. ఈ లోగా ఎలా రిజిస్ట్రేష‌న్ చేస్తార‌ని వాణి పోలీసుల ఎదుట ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. అస‌లు ఈ రిజిస్ట్రేష‌న్ చెల్ల‌ద‌ని తాను ఈ విష‌యంలో కోర్టుకు వెళ్తాన‌ని అక్క‌డి నుంచి త‌న కూతురిని తీసుకుని వెళ్లిపోయింది.