Chandrababu Naidu: కేంద్రం సాయం చేయ‌లేదు

chandrababu naidu says centre is yet to help on vijayawada floods

Chandrababu Naidu: విజ‌య‌వాడ వ‌ర‌ద‌ల‌పై కేంద్ర మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ స‌మీక్షించి త‌న అభిప్రాయాల‌ను తెలియ‌జేసారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఫోటో గ్యాల‌రీ ద్వారా జ‌రిగిన న‌ష్టాన్ని వివ‌రించారు. అయితే న‌ష్టం గురించి తెలుసుకున్న శివ‌రాజ్ సింగ్ కేంద్రంతో మాట్లాడి వెంట‌నే రూ.3300 కోట్లు ఆర్థిక సాయం ప్ర‌క‌టించిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై చంద్ర‌బాబు స్పందిస్తూ.. అదంతా అబ‌ద్ధం అని అన్నారు. తాను కేవ‌లం ఫోటో గ్యాల‌రీ చూపించాన‌ని.. వ‌ర‌ద‌ల‌పై ఇంకా రిపోర్టులు పంప‌కుండానే కేంద్రం ఎలా సాయం చేస్తుంద‌ని అన్నారు. కానీ కేంద్రం త‌ప్ప‌కుండా సాయం చేస్తుంద‌న్న న‌మ్మకం త‌న‌కు ఉంద‌ని తెలిపారు.