Salaar త‌ర్వాత ఇంకో సినిమా ఫిక్స్

Hyderabad: యంగ్​ రెబల్​ స్టార్​ ప్రభాస్(Prabhas), సెన్సేషనల్​ డైరెక్టర్​ ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా సలార్(Salaar)​. ఈ సినిమా విడుదలకోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతుందట. అదీ పౌరాణిక నేపథ్యంతో ఉండబోతుందట. ఈ చిత్రాన్ని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు(Dil Raju) నిర్మించబోతున్నారు.

ప్రస్తుతం పాన్ ఇండియా మొత్తం ఎదురు చూస్తున్న చిత్రం సలార్ (Salaar). ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో దేశవ్యాప్తంగా ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల నిర్మాతగా తన 20 ఏళ్ళ కెరీర్ ని పూర్తి చేసుకున్న దిల్ రాజు ట్విట్టర్ లో టాలీవుడ్ ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న ప్రభాస్ కమిట్మెంట్స్ అన్ని పూర్తి కాగానే తమ బ్యానర్ లో ఒక సినిమా ఉండబోతున్నట్లు తెలియజేశాడు.

తాజాగా ఆ సినిమాని ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయబోతున్నాడని తెలియజేయడంతో పాటు ఆ మూవీ పౌరాణిక నేపథ్యంతో ఉండబోతున్నట్లు వెల్లడించాడు. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ అయ్యినట్లు చెప్పుకొచ్చాడు. కాగా మొన్న ట్విట్టర్ ఇంటరాక్షన్ లో దిల్ రాజు.. తన డ్రీం ప్రాజెక్ట్ జటాయు గురించి కూడా వెల్లడించాడు. జటాయు చిత్రాన్ని త్వరలోనే మొదలు పెడతాను అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ప్రభాస్ పౌరాణిక కథ జటాయునే అయ్యి ఉంటదని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. మరి ఇది జటాయు(Jataayu) కథా? లేక ప్రశాంత్ నీల్(Prashanth Neel) సొంత కథా? అనేది తెలియాలి అంటే అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.