TDP వెన‌క‌డుగు.. విశాఖ ఉప ఎన్నిక‌లో పోటీ నుంచి త‌ప్పుకున్న పార్టీ

tdp is not contesting in visakha mlc by election

TDP: తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చాక తొలిసారి వెన‌క‌డుగు వేసింది. విశాఖ‌ప‌ట్నం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రాబోతున్న నేప‌థ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బొత్స స‌త్యనారాయ‌ణ‌ను ఎంపిక‌చేసింది. ఇక తెలుగు దేశం పార్టీ, కూట‌మి నుంచి ఎవ‌రు అభ్య‌ర్ధిగా పోటీ చేస్తారా అనే స‌న్నాహాలు మొద‌లైన నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ ఉప ఎన్నిక‌లో పోటీ చేయొద్ద‌ని నిర్ణ‌యించుకున్నారు. YSRCP కి మెజార్టీ సభ్యుల మద్దతు ఉండటంతో పోటీ చేయకపోవడమే మంచిదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.