Viral News: ఆడ‌వాళ్ల స‌మాధులు త‌వ్వి.. అత్యాచారానికి పాల్ప‌డుతూ..

a man from pakistan raped dead bodies from graveyard

Viral News: పాకిస్థాన్‌లో ఘోరం చోటుచేసుకుంది. ఓ 40 ఏళ్ల వ్య‌క్తి కొంత‌కాలంగా స్మ‌శానంలో ఉంటూ ఆడ‌వారి స‌మాధుల‌ను త‌వ్వి ఆ మృత‌దేహాల‌పై అత్యాచారానికి పాల్ప‌డుతున్నాడు. దాంతో పోలీసులు అత‌న్ని ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. స‌ల్మాన్ వ‌హీద్ అనే వ్య‌క్తి నిన్న రాత్రి అప్పుడే పాతిపెట్టిన 55 ఏళ్ల మ‌హిళ మృతదేహాన్ని బ‌య‌టికి తీసి అత్యాచారానికి పాల్ప‌డుతుంటే కొంద‌రు వ్య‌క్తులు అత‌న్ని రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. స‌ల్మాన్‌కు దేహ‌శుద్ధి చేసి పోలీసుల‌కు ప‌ట్టించారు.

స‌ల్మాన్‌ను విచారించ‌గా.. తాజాగా పాతిపెట్టిన మ‌హిళ‌ల మృత‌దేహాల‌పై మాత్ర‌మే అత్యాచారానికి పాల్ప‌డుతుంటాన‌ని.. అలా ఇప్ప‌టివ‌ర‌కు నాలుగు మృతదేహాల‌ను వెలికితీసాన‌ని ఒప్పుకున్నాడు. ఇలా శవాన్ని రేప్ చేయడాన్ని నెక్రోఫైలియా అంటారు. ఇది పాకిస్థాన్‌లో స‌ర్వ‌సాధార‌ణంగా జ‌రిగే ప్ర‌క్రియ‌. అందుకే చాలా మంది ఆడ‌వాళ్ల స‌మాధుల‌కు గేటు లాంటిది ఏర్పాటుచేసి ఆ స‌మాధిని ఎవ్వ‌రూ తవ్వ‌కుండా తాళం వేస్తుంటారు.