Modi: కాంగ్రెస్ నేత‌పై మోదీ ప్ర‌శంస‌లు.. KCRకి ఇన్‌డైరెక్ట్ పంచ్!

Rajasthan: ప్రధాని న‌రేంద్ర మోదీ(modi)..కాంగ్రెస్(congress) నేత అశోక్ గెహ్లోత్‌(ashok gehlot)ను ప్ర‌శంసించారు. ఈరోజు మోదీ(modi) ప్ర‌తిష్ఠాత్మ‌క వందే భార‌త్ ఎక్స‌ప్రెస్‌ను(vande bharat express) రాజ‌స్థాన్ నుంచి ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లోత్ పాల్గొన్నారు. ఈ నేప‌థ్యంలో మోదీ మాట్లాడుతూ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా మాట్లాడుతూ.. అశోక్ రాజ‌కీయంగా ఎన్నో స‌మ‌స్య‌ల్లో ఉన్న‌ప్ప‌టికీ.. త‌న రాష్ట్రంలో మంచి కార్యం జ‌రుగుతోందని తెలిసి ప్ర‌తిప‌క్ష పార్టీకి ఆహ్వానం ప‌లికడం గొప్ప విష‌యం అన్నారు. అశోక్ త‌న‌కు మిత్రుడులాంటివారు అని మెచ్చుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు 6 రాష్ట్రాల్లో మోదీ వందేభార‌త్ రైళ్ల‌ను ప్రారంభించారు.

అయితే మోదీ.. అశోక్‌ను ప్ర‌శంసించ‌డం తెలంగాణ(Telangana) ముఖ్య‌మంత్రి కేసీఆర్‌(KCR)కు ఇన్‌డైరెక్ట్ పంచ్ అని ప‌లువురు రాజ‌కీయ నిపుణులు అంటున్నారు. హైద‌రాబాద్‌లోని సికింద్రాబాద్‌లో వందేభార‌త్ రైలును మోదీ ప్రారంభించ‌డానికి వ‌చ్చిన‌ప్పుడు కేసీఆర్(KCR) వెళ్ల‌లేదు. అంత‌కుముందు మోదీ హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌డానికి వ‌చ్చిన‌ప్పుడు కూడా అనారోగ్యం కార‌ణంగా కేసీఆర్ మోదీని క‌ల‌వ‌లేక‌పోయారు. ఈ నేప‌థ్యంలో అశోక్ బీజేపీకి ప్రధాన ప్ర‌తిప‌క్ష పార్టీ అయిన కాంగ్రెస్ అభ్య‌ర్ధి అయిన‌ప్ప‌టికీ త‌న రాష్ట్రం బాగుప‌డ‌టం కోసం కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం నిజంగా అభినంద‌నీయం అని అంటున్నారు.