YSRCP నేత‌ల‌కు ఏపీ హైకోర్టు చీవాట్లు

ap high court straight questions to ysrcp leaders

YSRCP: ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌ల‌కు చీవాట్లు పెట్టింది. 2021లో తెలుగు దేశం పార్టీ కార్యాల‌యంపై వైఎస్సార్ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌పై ఏం చ‌ర్య‌లు తీసుకున్నారు అంటూ సూటి ప్ర‌శ్న వేసింది. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్ర‌యించిన వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌ల‌ను ప్ర‌జాస్వామ్య దేశంలో ఓ పార్టీకి చెందిన కార్యాల‌యంపై వంద‌ల మంది కార్య‌క‌ర్తలు వెళ్లి దాడి చేయ‌డ‌మేంటి అని మండిపడింది. ఏ కార‌ణాల వ‌ల్ల కేసుపై ద‌ర్యాప్తు ఆల‌స్యం అయ్యింది? ఏ నేత‌ల పాత్ర ఉంది? అనే అంశాల‌పై పూర్తి ఆధారాల‌ను కోర్టు ముందు పెడ‌తామ‌ని పోలీసులు తెలిపారు. ఈ నేప‌థ్యంలో ఈ కేసు విచార‌ణ‌ను కోర్టు ఈ నెల 5వ తేదీకి వాయిదా వేసింది.